Viral Video: దేవుడున్నాడు.. హుండీలో ఇరుక్కుపోయిన దొంగ చేయి..
దొంగతనం చేసే వారికి అది బడా.. గుడా అని సంబంధం లేదు. చేతివాటం చూపడమే వారి లక్ష్యం. వారికి డబ్బులు, బంగారం కనిపిస్తే చాలు చోర కళ బయట పడుతోంది. అయితే ఓ దొంగ దేవుడి హుండీకే కన్నం వేయ్యాలని చూశాడు. కానీ దేవుడు ఊరుకుంటాడా.. దొంగ పని పట్టాడు. దొంగ డబ్బుల కోసం హుండీలో చేయి పెట్టాడు. అయితే దొంగ చేయి హుండీ ఇరుక్కుపోయింది. ఏం చేసినా చేయి బయటకు రాలేదు.
చివరికి గ్రామస్థులు వచ్చి అతని హుండీ అతని చెయి బయటకు తీశారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలంలో జరిగింది. దొంగ చెయి హుండీలో ఇరుక్కున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిక్నూర్ రామేశ్వరపల్లిలోని మాసుపల్లి పోచమ్మ ఆలయంలో సురేశ్ అనే వ్యక్తి పని చేస్తాడు. అతను మంగళవారం రాత్రి హుండీలో డబ్బుల దొంగతనానికి ప్రయత్నించాడు.

గుడిలో దొంగతనం చేస్తుండగా హుండీలో ఇరుక్కుపోయిన చెయ్యి..
— Telugu Scribe (@TeluguScribe) April 3, 2024
బిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో ఉన్న మాసుపల్లి పోచమ్మ ఆలయంలో పనిచేసే సురేశ్ హుండి పై భాగాన్ని ధ్వంసం చేసి అందులో డబ్బు తీసేందుకు లోపల చెయ్యి పెట్టగా అది హుండీలో ఇరుక్కుపోయింది.
ఉదయం గుడికి వచ్చిన భక్తులు చూసి పోలీసులకి… pic.twitter.com/CtLrzQqiM6
భక్తులు సమర్పించిన కానుకలను ఎత్తుకెళ్దామని హుండీలో చేయి పెట్టాడు. చెయి హుండీలోనే ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నం చేసినా చెయి బయటకు రాలేదు. చేసేదేమి లేక ఉదయం వరకు గుడిలోనే ఉన్నాడు. గుడికి వచ్చిన భక్తులు స్థానికులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడి వచ్చారు. సురేష్ చెయిని హుండీ నుంచి బయటకు తీశారు. సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు నిజంగానే దేవుడున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. దేవుడి మహిమతోనే సురేశ్ చెయి హుండీలో ఇరుక్కుపోయిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications