మండుతున్న ఎండలు, తెలుగురాష్ట్రాల్లో 12 మంది మృత్యువాత
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. మే మాసం రాకముందే ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఎండల తీవ్రతకు తెలంగాణలో 15 మంది చనిపోయినట్టు అధికారుల దృష్టికి
హైద్రాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. మే మాసం రాకముందే ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఎండల తీవ్రతకు తెలంగాణలో 15 మంది చనిపోయినట్టు అధికారుల దృష్టికి వచ్చింది. ఆంద్రప్రదేశ్ లో 12 మంది మరణించారని నివేదికలు చెబుతున్నాయి.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ ఎండలు తీవ్రంగా ఉన్నాయి. తెలంగాణలో హైద్రాబాద్ తో పాటు ఆదిలాబాద్, మహాబూబ్ నగర్, భద్రాచలం, నిజామాబాద్, మెదక్ లలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటివరకు 30 మంది వడదెబ్బతో చనిపోయారని అనధికారిక సమాచారం.అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రీమెన్ కమటీ సభ్యుల దృష్టికి 15 మాత్రమే వచ్చాయి.అయితే ఇందులో ఏడుగురు వడదెబ్బతో చనిపోయారని త్రీమెన్ కమిటీ నిర్ధారించింది.
తెలంగాణలోని కరీంనగర్ , ఖమ్మం, కుమ్రంబభీమ్ జిల్లా, మహాబూబ్ నగర్, మంచిర్యాల, సూర్యాపేట, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ఒక్కరి చొప్పున వడదెబ్బతో మరణించినట్టుగా త్రీమెన్ కమిటీ నిర్ధారించింది.అయితే అనధికారికంగా మరణించినవారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు అధికారులు.

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. నెల్లూరు, గుంటూరు, కడప తదితర జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుఅవుతున్నాయి.అయితే వడదెబ్బ కారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 12 మంది చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు అధికారులు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications