నలుగురు పిల్లలను గుంజకు కట్టేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ .. అసలేం జరిగిందంటే
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చిన్నపిల్లలని కూడా చూడకుండా ఓ కిరణం షాపు యజమాని నలుగురు పిల్లలను తాళ్లతో కట్టేసి కొట్టిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
కాకినాడలో దారుణం .. ఐదేళ్ళ బాలికపై రేప్ .. రక్తపు మడుగులో చిన్నారి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మద్దులపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటనలో కిరణా షాపు యజమాని చిన్నారులను తన దుకాణంలో నగదు చోరీ చేస్తున్నట్లుగా గుర్తించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.
అంత వరకు బాగానే ఉన్నా పిల్లలంతా మైనర్లు కాబట్టి మందలించి పంపించాల్సిందిబోయి నలుగురు పిల్లలను గుంజకు కట్టేసి కొట్టారు. ఆ తర్వాత దుకాణ యజమాని పిల్లల తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పి తల్లిదండ్రులను పిలిపించి వారికి పిల్లలను అప్పగించారు . అయితే షాప్ ముందు పిల్లలు కట్టేసి ఉండడంతో కొందరు వీడియో తీసి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గుంజకు కట్టేసిన పిల్లల వ్యవాసు 12, 13 సంవత్సరాలు ఉంటుందని అంటున్నారు.
దీంతో
మైనర్
బాలుర
హక్కులపై
పెద్ద
ఎత్తున
చర్చ
జరుగుతుంది.
తప్పు
చేస్తే
మందలించాలి
కానీ
షాపు
యజమాని,
ఈ
విధంగా
ప్రవర్తించటం
దారుణమని
తీవ్ర
ఆరోపణలు
వెల్లువెత్తుతున్నాయి.
ఈ
ఘటనపై
పోలీసులు
స్థానికుల
నుండి
వివరాలు
తెలుసుకుంటున్నారు.
బాలలకు
ప్రత్యేక
హక్కులు
ఉన్న
నేపధ్యంలో
బాలల
హక్కుల
సంఘాలు
ఈ
ఘటనపై
ఎలా
స్పందిస్తాయో
చూడాలి
.