వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్బు పంచలేదని ఓటు వేయబోమన్న గ్రామస్తులు .. అవాక్కైన అధికారులు .. ఇదేనా ఓటరు చైతన్యం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల తొలివిడత పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలో పరిషత్ ఎన్నికల్లో ఊహించని విచిత్ర సంఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. . మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడ గ్రామస్తులు ఎన్నికల్లో ఓట్లు వెయ్యటానికి నిరాకరిస్తున్నారు. వారు ఓటు వెయ్యమని చెప్తుంది.. తమ సమస్యల పరిష్కారం కోసం అనుకుంటే తప్పులో కాలేసినట్టే . వారు ఓట్లు వెయ్యకుండా అలగటానికి గల కారణం తెలిస్తే అవాక్కవ్వటం మీ వంతు అవుతుంది .

స్థానిక సంస్థల పోరు ...బ్యాలెట్ పోరుపై సర్వత్రా ఉత్కంఠ స్థానిక సంస్థల పోరు ...బ్యాలెట్ పోరుపై సర్వత్రా ఉత్కంఠ

 ఎన్నికల్లో ఓటేసేందుకు డబ్బులు ఇవ్వలేదని ఓట్లు వెయ్యమని అలిగిన గ్రామస్తులు

ఎన్నికల్లో ఓటేసేందుకు డబ్బులు ఇవ్వలేదని ఓట్లు వెయ్యమని అలిగిన గ్రామస్తులు

అసలు విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు జరుగుతున్న ఎన్నికలకు గాను నిన్న రాత్రి చింత గూడ గ్రామంలో పోటీలో ఉన్న అభ్యర్థులు డబ్బులు పంచారు. ఓ పార్టీకి చెందిన నేతలు ఒక వర్గానికి చెందిన వారికి మాత్రమే డబ్బులు పంపిణీ చేశారని తెలుస్తోంది. దీంతో డబ్బులు అందని మరో వర్గం ప్రజలు నిరసనకు దిగారు. వారంతా ఓటు వేయడానికి నిరాకరించారు. మాకు డబ్బులు పంచనప్పుడు.. మేము ఓటు ఎందుకు వేయాలని నిలదీస్తున్నారు. డబ్బు ఇస్తేనే ఓటు వేస్తామని వారు తెగేసి చెబుతున్నారు.

మాకు డబ్బు ఎందుకు ఇవ్వలేదు మేం ఓటర్లం కాదా అని నిలదీస్తున్న వైనం

మాకు డబ్బు ఎందుకు ఇవ్వలేదు మేం ఓటర్లం కాదా అని నిలదీస్తున్న వైనం

డబ్బు ఎవరికి అందిందో వాళ్లే ఓట్లు వేస్తున్నారని చెబుతున్నారు. తమకు డబ్బు ఇవ్వకపోవడాన్ని మహిళలు అవమానంగా ఫీల్ అవుతున్నారు.కొందరు మహిళలు ఏకంగా లోకల్ లీడర్లతో ఘర్షణకు దిగారు. మేము ఓటర్లం కాదా, మాకు ఓట్లు లేవా అని నిలదీస్తున్నారు . మాకు డబ్బు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు .డబ్బులు పంచలేదని చింతగూడ గ్రామస్తులు నిరసనకు దిగడం, డబ్బు పంచిన నేపధ్యంలో డబ్బు అందిన వారు మాత్రమే ఓటు వేస్తున్నట్టు ప్రచారం జరగడం చర్చనీయాంశంగా మారింది.

గ్రామస్తుల తీరుతో అవాక్కవుతున్న అధికారులు .. ఇదేనా ఓటరు చైతన్యం

గ్రామస్తుల తీరుతో అవాక్కవుతున్న అధికారులు .. ఇదేనా ఓటరు చైతన్యం

గ్రామస్తుల తీరుతో అటు ఎన్నికల అధికారులు సైతం అవాక్కవుతున్నారు. ఓటు మన హక్కు.. మన ఆయుధం . దానిని నోటు కోసం అమ్ముకోకండి .. సమర్ధులైన నాయకులను ఎన్నుకోండి అని ఎంత చెప్పినా అవేవీ ప్రజలు పట్టించుకోవటం లేదు అని చెప్పటానికి ఈ సంఘటనే ఉదాహరణ. అధికార యంత్రాంగం ఎంత చైతన్యవంతులను చెయ్యాలని ప్రయత్నం చేసినా ఓటరు మాత్రం ప్రలోభాలకు లొంగి తన ఓటును నోటుకు అమ్ముకుంటూనే ఉన్నాడు.

English summary
Elections are being held for MPTC and ZPTC in Telangana state. Candidates contesting in the village of Chintha Guda of Mahabubabad district distributed money yesterday night to a group of people. It seems that some of the party leaders has distributed money only to a group of people. This is got to know the people . Without money They refused to vote and they fired on local leaders who distributed money to some people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X