విజయశాంతి ఇంట్లో చోరీ: అది పనిమనిషి చేసిందే
హైదరాబాద్: తెలంగాణ రాములమ్మ, మాజీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్లో గల విజయశాంతి ఇంట్లో బంగారు నగలు చోరీ అయ్యాయి. విజయశాంతి తన బంగారు నగల చోరీపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు. విజయశాంతి బంగారు నగలు చోరీ కావడం సినిమా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయశాంతి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) తరఫున గతంలో పార్లమెంటుకు ఎన్నికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కాంగ్రెసు పార్టీలో ఉన్నారు.

విజయశాంతి ఇంట్లో పనిమనిషే చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో నివాసముంటున్న విజయశాంతి ఇంట్లో ఐదురోజుల క్రితం డైమండ్స్ పొదిగిన చెవిదిద్దులు, ఉంగరం, గాజులు మాయమయ్యాయి. పోలీసులు వారి స్టైల్లో విచారించే సరికి అసలు విషయం బయటపడింది.
ఇదిలావుంటే, తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలుపడ్డారు. వారు రూ.70 వేల నగదుతో పాటు ఐదు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన హైదరాబాదు నగరంలోని ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారంనాడు వెలుగు చూసింది.
స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి రెండు రోజల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. శుక్రవారంనాడు వచ్చి చూసేసరికి ఇంట్లో ఉన్న నగదుతో పాటు బంగారు ఆభరణాలను కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications