Inter Exam Fee: భారీగా పెరగనున్న ఇంటర్ పరీక్ష ఫీజులు..!
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) ఇంటర్ పరీక్ష ఫీజును పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి నవంబర్ 5న అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. పలు వార్త పత్రికల కథనాల ప్రకారం ఫీజు ప్రస్తుతం ఛార్జీని రూ. 500 గా ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని రూ.1500 వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. సవరించిన ఫీజులు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పరీక్షల నుంచి అమల్లోకి రానున్నాయి.
ప్రతిపాదిత పెరుగుదల విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యాల నుంచి వచ్చే వారికి ఇది షాకింగ్ వార్త అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న రూ.500 ఫీజు ఇప్పటికే చాలా మందికి ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని పేర్కొంటూ ఈ పెంపుపై విద్యార్థులు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఒకేసారి రూ.1000 పెంచితే తీవ్ర భారం పడనుంది. ఈ ఫీజు పెంపు కొంతమంది విద్యార్థులు తమ పరీక్షల్లో పాల్గొనడం సందేహంగా మార్చింది.

చాలా మంది విద్యార్థులు ఇప్పటికే ప్రాథమిక విద్యా ఖర్చులను భరించలేక ఇబ్బందులు పడుతుండగా, ఈ పెంపు వారి చదువులను పూర్తి చేయడానికి, ఉన్నత విద్యను అభ్యసించడానికి వారి సామర్థ్యానికి మరింత ఆటంకం కలిగించవచ్చని భావిస్తున్నారు. ఫీజు పెంపుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే చాలా రోజులుగా ఫీజు పెంచలేదు. పరీక్షల నిర్వహణ వ్యయం పెరగడంతోనే ఫీజులు పెంచే యోచనలో ఇంటర్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఒకేసారి ఇంత మొత్తం పెంచకుండా.. క్రమంగా పెంచితే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇంటర్ పరీక్షలు ఫీజులు పెంచితే సామాన్య ప్రజలు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లక్షలు పెట్టి కాలేజీల్లో చదివేవారికి ఫీజు పెంపు ప్రభావం చూపదని చెబుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివి విద్యార్థులకు ఈ పెంపు ఆందోళన కలిగించే అంశమే.
-
అమెరికాలో సంవత్సరం ఆడి సంచలనం సృష్టించిన తెలుగు సినిమా -
Free Bus ఏపీలో ప్రారంభమైన కొత్త పథకం, వారికి కూడా ఇంద్రధనస్సు -
అంచనాలకు అందని బంగారం ధరలు- తలకిందులు -
ట్రంప్ ఆజ్ఞను ధిక్కరించిన సైన్యం.. AI తో ఇరాన్పై దాడి -
టీటీడీ వాడి అబ్బ సొత్తా- చంద్రబాబు చెబితే నిమిషంలో రాజీనామా చేస్తా- బీఆర్ నాయుడు -
IND vs WI: స్కోర్ చెప్పేసిన దాదా.. చెమటలు చిందిస్తున్న టీమిండియా -
ఖమేనీ కేవలం నేత కాదు.. కోట్ల మంది మతగురువు: ప్రధాని మోదీకి ఒవైసీ డిమాండ్ -
CBSE Board Exams Deferred: రేపు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు వాయిదా..! -
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. వీళ్లు అస్సలు మిస్ అవ్వొద్దు..! -
Silver:వెండి ధరలకు విస్ఫోటనం సంకేతాలు! సోమవారం ఏం జరగబోతుంది -
చుక్కలు చూపెడుతున్న సిలిండర్ రేట్లు- ఏటీఎఫ్ ధరలకూ రెక్కలు -
ఖమేనీ మృతి: 40 రోజుల పాటు సంతాప దినాలు: కోడలు, అల్లుడు, మనవళ్లు సైతం












Click it and Unblock the Notifications