Online Admissions for junior: తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ఇంటర్ కాలేజీల్లో ఆన్ లైన్ అడ్మిషన్లు..!
విద్యరంగంలో సాంకేతికత పెరుగుతోంది. ఎలాంటి అక్రమాలు చోటు లేకుండా ఉండేందుకు ప్రవేశాల్లో ఆన్ లైన్ ప్రక్రియ తీసుకొచ్చారు. గతంలో ఇంజినీరింగ్, మెడిసిన్ కు ఆన్ లైన్ ప్రవేశాలు ఉంటుండే. ఆ తర్వాత డిగ్రీలో కూడా ఆన్ లైన్ ప్రవేశాలు తీసుకొచ్చారు. తాజాగా ఇంటర్ లో కూడా ఆన్ లైన్ ప్రక్రియ తీసుకురావాలని భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు వసూలు చేసే అధిక ఫీజులను నియంత్రించే అవకాశం ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి జూనియర్ కళాశాలల కోసం ఆన్లైన్ అడ్మిషన్ విధానాన్ని ప్రారంభించనుంది.
ఈ కేంద్రీకృత వ్యవస్థ ప్రస్తుత మాన్యువల్ ప్రక్రియను భర్తీ చేయనున్నారు. ఇలా చేయడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులకు అడ్మిషన్లను సులభతరంగా పొందవచ్చు. విర్థులు ఒకే ఆన్లైన్ ప్లాట్ఫారమ్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ మరియు కార్పొరేట్ కళాశాలలతో సహా బహుళ జూనియర్ కళాశాలలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం SSC గ్రేడింగ్ విధానాన్ని మార్కుల ఆధారిత విధానంతో భర్తీ చేస్తున్నారు. వచ్చే సంవత్సరం మార్కుల ప్రకారం ర్యాంకులు కేటాయించే అవకాశం ఉంది.

మార్పు వల్ల విద్యార్థులు వారి స్కోర్ల ఆధారంగా ర్యాంక్ను పొందేందుకు వీలు కల్పిస్తుంది. సీట్ల కేటాయింపు సరళంగా,మరింత పారదర్శకంగా ఉండనుంది.గ్రేడింగ్ విధానం వల్ల ర్యాంక్ ప్రకటించలేరు. అందుకే గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. ఆన్లైన్ అడ్మిషన్లను ప్రారంభించే ముందు ప్రభుత్వం కాజేజీల ఫీజును నిర్ణయించనున్నారు. ఇలా చేయడం కార్పొరేట్ కాలేజీలు అధిక ఫీజు వసూలు చేయడానికి అవకాశం లేదు. ఆన్లైన్ జూనియర్ కాలేజీ అడ్మిషన్ సిస్టమ్ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం ఉపయోగించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (డోస్త్) మాదిరిగానే ఉంటుందని చెబుతున్నారు.
దోస్త్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ర్యాంక్లు ఇస్తుంది. మెరిట్ మరియు రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా సీట్లను కేటాయిస్తుంది. కాగా తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు చేశారు. గతంలో ఫైనల్ పరీక్షలు 80 మార్కులకే నిర్వహించేవారు. మిగతా 20 మార్కులకు అసైన్ మెంట్ నిర్వహించేవారు. కానీ ఇప్పుడు దీన్ని రద్దు చేసి 100 మార్కులకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications