రేపే చర్లపల్లి వీక్లీ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం- ఏపీలో హాల్ట్ స్టేషన్లు
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికులకు తీపి కబురు వినిపించింది. హైదరాబాద్ కు కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును మంజూరు చేసింది. ఇది వీక్లీ ఎక్స్ ప్రెస్. శుక్రవారం పట్టాలెక్కబోతోంది. దీనికి సంబంధించిన టైమ్ టేబుల్, ఏపీలో హాల్ట్ స్టేషన్ల జాబితా విడుదల అయింది. నాలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేసే ఎక్స్ ప్రెస్ ఇది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
చర్లపల్లి నుంచి తిరువనంతపురం నార్త్ మధ్య ఈ కొత్త అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. తిరువనంతపురం నార్త్ నుంచి శుక్రవారం (జనవరి 23) ఉదయం 10:45 నిమిషాలకు బయలుదేరే నంబర్ 06308 ఎక్స్ ప్రెస్.. మరుసటి రోజు సాయంత్రం 4:30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఇది ఇనాగ్యురల్ సర్వీస్. రెగ్యులర్ ఎక్స్ ప్రెస్ నంబర్ 17041/17042 టైమ్ టేబుల్ త్వరలో వెల్లడిస్తామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

తిరువనంతపురం నార్త్ నుంచి బయలుదేరే ఇనాగ్యురల్ సర్వీస్.. వర్కల శివగిరి (11:23/11:26), కొల్లం (11:52/11:55), కరునాగపల్లి (12:20/12:23), కాయంకులం (12:40/12:43), మావెలికర (12:52/12:55), చెంగన్నూర్ (13:05/13:08), తిరువళ్ల (13:17/13:20), చంగనస్సేరి (13:30/13:33), కొట్టాయం (13:50/13:55), ఎర్నాకులం టౌన్ (14:55/15:00), ఆలువా (15:20/15:23), త్రిస్సూర్ (16:25/16:30), పాలక్కాడ్ (18:00/18:05) స్టేషన్లల్లో ఆగుతుంది.
తమిళనాడులో కోయంబత్తూరు (19:35/19:40), తిరుపూరు (20:25/20:30), ఈరోడ్ (21:20/21:30) వద్ద స్టాప్లు ఉంటాయి. సేలం (22:20/22:23), జోలార్పేట, (00:02/00:05), కాట్పాడి (01:10/01:15), తిరుత్తణి (02:17/02:20), రేణిగుంట (03:20/03:30), నెల్లూరు (05:43/05:45), ఒంగోలు (07:30/07:32), బాపట్ల (08:30/08:32), తెనాలి (09:38/09:40), గుంటూరు (10:20/10:30), సత్తెనపల్లి (11:23/11:25), మిర్యాలగూడ (12:48/12:50), నల్గొండ (13:23/13:25) లల్లో హాల్ట్ సౌకర్యం ఉంది.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications