కవితను విచారించేందుకు సీబీఐ తొందర అందుకే : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే .అయితే తాజాగా ఎమ్మెల్సీ కవితని విచారించడానికి సిబీఐ రంగంలోకి దిగింది. ఈ మేరకు సిబిఐ అధికారులకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతినిచ్చింది. ఇక కవిత సీబీఐ విచారణ పట్ల సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కవిత సీబీఐ విచారణపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
కవితను ఇదే సమయంలో సిబిఐ విచారించవలసిన అవసరాన్ని ఆయన తనకున్న అనుభవంతో వివరించారు. కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నందున ఆమెను విచారించాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి కాబట్టి సిబిఐ కోర్టు అనుమతితో కవితను విచారించడానికి సిద్ధమైందన్నారు. ఇక సిబిఐ అధికారులు మహిళ అయిన కవితను విచారించే క్రమంలో అక్కడ మహిళాఅధికారులు ఉంటారని విచారణ ఎదుర్కొనేవారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా అక్కడ మహిళా కానిస్టేబుల్స్ ఉంటారని తెలిపారు.

సీబీఐ విచారణకు త్వరపడింది ఇందుకే
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడి మనీ లాండరింగ్ గురించి దర్యాప్తు చేస్తే సిబిఐ అందులో జరిగిన అవినీతి గురించి, ఎవరి పాత్ర ఏంటి అన్నదాని గురించి దర్యాప్తు చేస్తుందన్నారు. తమ పరిధి మేరకే సిబిఐ కేసులో చార్జిషీట్ దాఖలు చేస్తుందని సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ తెలిపారు. కవిత తన కుమారుని పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలోనే సిబిఐ విచారణకు త్వరపడినట్లుగా సిపిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.
సీబీఐ అడుగుల వెనుక కవిత బెయిల్
కవితకు బెయిల్ వస్తే విచారించడం కష్టంగా మారుతుందని భావించి, జ్యుడీషియల్ రిమాండ్ కొనసాగుతున్న సమయంలోనే సిబిఐ కూడా అడుగులు వేసింది అన్నారు. కుమారుడి పరీక్షల నిమిత్తం బెయిల్ కోరిన కవితకు కోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని అయితే కోర్టు తాత్కాలికంగానే బెయిల్ ఇవ్వచ్చని, బెయిల్ పై బయటకు వచ్చిన సమయంలో సాక్షులను ప్రభావితం చేయరాదని, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని ఆంక్షలు విధించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
సీబీఐ విచారణతోనే కవితకు ఉచ్చు బిగిసినట్టు కాదు
అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటువంటి కేసులలో నిందితులకు బెయిల్ రాకుండా ఉండాలని ప్రతి 15 రోజులకు ఒకసారి రిమాండ్ ను పెంచడానికి ప్రయత్నం చేస్తారని, కవిత విషయంలోను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బెయిల్ రాకుండా ప్రయత్నం చేస్తుందని అన్నారు. అయితే సిబిఐ, ఈడి అధికారులు విచారణ చేసినంత మాత్రాన కవిత చుట్టూ ఉచ్చుబిగుస్తుంది అని చెప్పలేమని, ఆమెపై మోపబడిన ఆరోపణలు, సేకరించిన ఆధారాలు కోర్టులో నిలబడితేనే తప్ప చెప్పలేమన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications