టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకుల హౌస్ అరెస్ట్: భగ్గుమన్న కాంగ్రెస్!!
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు దయనీయ పరిస్థితులకు చేరుకున్నాయని, సర్పంచుల సమస్యలతో సతమతమవుతున్నారని తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో నలిగిపోతున్న గ్రామ పంచాయతీల సమస్యలపై, సర్పంచుల విధుల సమస్యలపై టీపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర రాజీవ్ గాంధీ పంచాయితీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో నేడు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇందిరా గాంధీ పార్క్ వద్ద ధర్నా చేపట్టాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో ధర్నా చౌక్ వద్ద ధర్నాకు టి.కాంగ్రెస్ పిలుపునివ్వడంతో పోలీసులు టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని ధర్నాలో పాల్గొనకుండా ముందస్తుగా అరెస్ట్ చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగానూ కాంగ్రెస్ కు చెందిన కీలక నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. పలు చోట్ల కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో కనీసం ఆందోళన తెలియజేయడానికి కూడా ప్రతిపక్ష పార్టీలకు స్వాతంత్ర్యం లేని పరిస్థితి ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు.

రాష్ట్రంలో సర్పంచులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు అని, తమ సమస్యల పరిష్కారం కాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తుందని మండిపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. సర్పంచుల విధుల కోసం ఆందోళన చేసే తమను అడ్డుకోవటం దారుణం అన్నారు. గ్రామాలకు వచ్చే 14 మరియు 15 ఫైనాన్స్ నుంచి వచ్చే సొమ్మును సైతం ఫోర్జరి డిజిటల్ సైన్ ద్వార దొంగిలిస్తూ కనీసం నిరసన తెలపటానికి, వాళ్లకు మద్దతు ఇవ్వటానికి వెళ్తున్న రేవంత్ రెడ్డిని ముందస్తు అరెస్టు చేయటం దుర్మార్గమైన చర్య, ఇదీ మీ నియంత ధోరణికి పరాకాష్ఠ అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications