రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం..!?
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సీఎం రేవంత్ లక్ష్యంగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం పైన పార్టీ హైకమాండ్ కు నివేదికలు వెళ్లాయి. వీటి పైన రాష్ట్ర ఇంఛార్జ్ నుంచి ఏఐసీసీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి నేరుగా రాజగోపాల్ రెడ్డితో మాట్లాడాలని నిర్ణయించారు. ఆ తరువాత పార్టీ నిర్ణయం పైన స్పష్టత రానుంది.
తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పదేపదే బహిరంగ విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయనుందని సమాచారం. తనకు మంత్రి పదవి ఇస్తానని పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చిందని పలు మార్లు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన కంటే జూనియర్ల కు మంత్రి పదవి ఇచ్చారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో సీఎం రేవంత్ పైన చేసిన వ్యాఖ్యల పైన పార్టీలో చర్చ మొదలైంది. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కాగా, ఈ విషయం పైన టీపీసీసీ క్రమిశిక్షణా కమిటీ ఛైర్మన్ మల్లు రవి రంగంలోకి దిగారు.

మల్లు రవి తాజా వివాదం పై రాజగోపాల్ రెడ్డితో మాట్లాడనున్నారు. ఆయన స్పందనకు అనుగుణం గా నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, ఒక దశలో రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇవ్వనున్నారనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డితో మల్లు రవి రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శల గురించి మల్లు రవి వివరణ కోరనున్నారు. ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి, కాంగ్రెస్కి నష్టం కలుగుతోందని క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది. పార్టీ పరువును దిగజార్చే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై క్రమశిక్షణ కమిటీ ఒక నిర్ణయానికి రానుంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications