టీఆర్ఎస్ దొంగలు ఎంతకైనా తెగిస్తారు, నేరచరిత్ర ఉన్నవారికే ఆ పార్టీ టికెట్లు: రేవంత్ రెడ్డి
తెలంగాణ మున్సిపల్ పోరు ప్రచారానికి రేపటితో తెరపడనుంది. దీంతో ప్రధాన పార్టీలు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. తమను గెలిపిస్తే, అదీ చేస్తాం, ఇదీ చేస్తాం అంటూ ఊదరగొడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో ప్రధానంగా అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ ముఖ్యనేత రేవంత్ రెడ్డి ఆదివారం ప్రచారం నిర్వహించారు.

జర జాగ్రత్త..
మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ నేతలు ఎంతకైనా తెగిస్తారని రేవంత్ రెడ్డి శ్రేణులను హెచ్చరించారు. ఆ టీఆర్ఎస్ దొంగలు గెలవడానికి ఎంతకైనా బరితెగిస్తారని మండిపడ్డారు. జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలకు సజెస్ట్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను బెదిరించే వారిని వదిలిపెట్టబోమని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వారి భరతం పడతామని శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.

నేరచరిత్ర..
మున్సిపల్ ఎన్నికల్లో నేరచరిత్ర ఉన్నవారికే టీఆర్ఎస్ పార్టీ టికెట్లు కేటాయించిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీలో సచ్చిలురు ఎవరూ లేరని, భూతద్దాం పెట్టుకొని చూసినా కనిపించరని విమర్శించారు. బండారి లేఔట్ వర్షాలతో మునిగిపోతే ప్రభుత్వం పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఈ ప్రభుత్వానికి ప్రజల సాధక బాధలు పట్టవని ధ్వజమెత్తారు.

రేవంత్ రెడ్డి
పేదలకు సొంత ఇళ్లు అందించాలనే ఉద్దేశంతో రాజీవ్ గృహకల్పను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. గృహకల్పతో పేదలు, మధ్యతరగతి వారి సొంతింటి కల సాకారమైందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తామని చెబుతోన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను ఎప్పుడు పూర్తిచేస్తోందో ఆ భగవంతుడికే తెలియాలన్నారు. 20వ తేదీతో సాయంత్రంతో ప్రచారం ముగియనుండగా.. ఈ నెల 22వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 25వ తేదీన ఓట్లను లెక్కించి, ఫలితాలను ఎన్నికల అధికారులు వెల్లడిస్తారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications