Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీఆర్ఎస్ 100 కోట్ల భూమి స్వాహా.!అధికారాన్ని అడ్డంపెట్టుకొని కబ్జాలు చేస్తున్నారన్న దాసోజు శ్రవణ్.!

హైదరాబాద్ : తెలంగాణలో పేదవాడు పేద వాడిగానే మిలిగిపోతుంటే, టీఆర్ఎస్ పార్టీ, నాయకులు ఆస్తులు విచ్చలవిడిగా పెంచుకుంటున్నారని ఎఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ ఆరోపించారు. టీఆర్ఎస్ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా హైదరాబాద్ నడిగడ్డ అయిన ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన బంజారాహిల్స్‌లో 4539 గజాల భూమిని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి కేటాయిస్తూ రాత్రికి రాత్రి కబ్జా చేయడం దుర్మార్గమని, రాష్ట్ర కార్యాలయానికి కూతవేటు దూరంలో జిల్లా కార్యాలయం ఎందుకని, టీఆర్ఎస్ పార్టీ భూదాహానికి ఇది పరాకాష్ట అని శ్రవణ్ మండిపడ్డారు.

 పెరిగిపోతున్న టీఆర్ఎస్ నేతల కబ్జాలు.. తెలంగాణ భవన్ ఉండగా మరో కార్యాలయం ఎందుకన్న కాంగ్రెస్

పెరిగిపోతున్న టీఆర్ఎస్ నేతల కబ్జాలు.. తెలంగాణ భవన్ ఉండగా మరో కార్యాలయం ఎందుకన్న కాంగ్రెస్

టీఆర్ఎస్ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న అరాచక కబ్జాలను ప్రజలు లోతుగా గమనించాలని శ్రవణ్ పేర్కొన్నారు. 2014లో టీఆర్ఎస్ పార్టీ ఆస్తులు, నాయకుల ఆస్తులు ఎంత ? 2022లో ఆస్తులు ఎంత ? అని నిలదీసారు. ప్లీనరీ మీటింగ్ లో తమ పార్టీ ఆస్తులు 870 కోట్లకు పెరిగాయని టీఆర్ఎస్ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు శ్రవణ్. దానం నాగేందర్ 10 వేల ఇండ్లు కట్టిస్తా అని గెలిచిన తర్వాత కూడా వంద ఇండ్లు కూడా కట్టియ్యలేదని, ఆయనకు పేదల ఇండ్ల నిర్మాణానికి భూమి దొరకడం లేదు కానీ టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి మాత్రమే భూమి దొరుకుతుందని ఎద్దేవా చేసారు.

 నగరం నడిబొడ్డులో ఎకరం స్థలం ఆక్రమణ.. టీఆర్ఎస్ నేతల భూదాహం అంటున్న దాసోజు శ్రవణ్

నగరం నడిబొడ్డులో ఎకరం స్థలం ఆక్రమణ.. టీఆర్ఎస్ నేతల భూదాహం అంటున్న దాసోజు శ్రవణ్


టీఆర్ పార్టీకి అక్రమ కేటాయింపు చేసిన జీవో 47ను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున భూపోరాటం చేస్తామని శ్రవణ్ హెచ్చారించారు.
ఖైరతాబాద్ ప్రజలకు చెందాల్సిన ఎన్బీటీ నగర్ బంజారాహిల్స్ ప్రభుత్వ భూముల్లో రెండు గదుల ఇండ్లు కట్టకుండా టీఆర్ఎస్ పార్టీకి ఆ భూములను కేటాయించి నందుకు నిరసనగా ఆ భూమిలో జాతియ జండాలను పాతుతామన్నారు శ్రవణ్. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి జిల్లా కార్యాలయాల కోసం భూ కేటాయింపులు చేయలేదు కానీ టీఆర్ఎస్ మాత్రం ప్రతి జిల్లా కేంద్రంలో ఎకరం స్థలంలో పార్టీ కార్యాలయాలతో పాటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ల పేరుతో విలాసవంతమైన బంగళాలు నిర్మించుకుంటున్నారని మండిపడ్డారు.

 నగరం నడిబొడ్డులో ఎకరం స్థలం ఆక్రమణ.. టీఆర్ఎస్ నేతల భూదాహం అంటున్న దాసోజు శ్రవణ్

నగరం నడిబొడ్డులో ఎకరం స్థలం ఆక్రమణ.. టీఆర్ఎస్ నేతల భూదాహం అంటున్న దాసోజు శ్రవణ్


టీఆర్ పార్టీకి అక్రమ కేటాయింపు చేసిన జీవో 47ను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున భూపోరాటం చేస్తామని శ్రవణ్ హెచ్చారించారు.
ఖైరతాబాద్ ప్రజలకు చెందాల్సిన ఎన్బీటీ నగర్ బంజారాహిల్స్ ప్రభుత్వ భూముల్లో రెండు గదుల ఇండ్లు కట్టకుండా టీఆర్ఎస్ పార్టీకి ఆ భూములను కేటాయించి నందుకు నిరసనగా ఆ భూమిలో జాతియ జండాలను పాతుతామన్నారు శ్రవణ్. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి జిల్లా కార్యాలయాల కోసం భూ కేటాయింపులు చేయలేదు కానీ టీఆర్ఎస్ మాత్రం ప్రతి జిల్లా కేంద్రంలో ఎకరం స్థలంలో పార్టీ కార్యాలయాలతో పాటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ల పేరుతో విలాసవంతమైన బంగళాలు నిర్మించుకుంటున్నారని మండిపడ్డారు.

 డబుల్ బెడ్ రూం ఇళ్లకు స్థలాలు దొరకవ్..కానీ పార్టీ కార్యాలయాలకు మాత్రం దొరుకుతాయా.?

డబుల్ బెడ్ రూం ఇళ్లకు స్థలాలు దొరకవ్..కానీ పార్టీ కార్యాలయాలకు మాత్రం దొరుకుతాయా.?


తెలంగాణ ప్రభుత్వానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టమంటే నగరం నడి మధ్యలో భూములు లేవని కుంటి సాకు చెబుతున్నారు కానీ, పార్టీ కార్యాలయాలకు మాత్రం వందల వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు అప్పనంగా కొట్టేస్తున్నారని, పేదోడికి వెలివాడలు కట్టినట్లు ఊరవతల అరకొర డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తున్నారని, కానీ టిఆర్ఎస్ పార్టీకి మాత్రం ఊరి మధ్యలో పార్టీ భవంతుల నిర్మాణం ఎంతవరకు న్యాయమని శ్రవణ్ సూటిగా ప్రశ్నించారు. ఆత్మబలిదానాలు, అమరవీరుల త్యాగాలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నేడు రాబందుల పాలయ్యిందని చెప్పడానికి నిదర్శనం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, నాయకులు పెంచుకుంటున్న ఆస్తులు అన్నారు దాసోజు శ్రవణ్.

 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ల పేరుతో విలాసవంతమైన బంగళాలు.. అవసరమా అని ప్రశ్నించిన శ్రవణ్

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ల పేరుతో విలాసవంతమైన బంగళాలు.. అవసరమా అని ప్రశ్నించిన శ్రవణ్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూబిలీహిల్స్ సొసైటీ భూములపై విచారణ జరగాలని కోరుకున్నాం కానీ విచారణ లేకపోగా వున్న భూములు కూడా టీఆర్ఎస్ పెద్దలకు ఇష్టం వచ్చినట్లు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. వేల కోట్ల విలువైన ఫిలింనగర్ భూములను రెడ్ పోర్ట్ కంపెనీ పేరుతో ఎంపీ రంజిత్ రెడ్డికి 14ఎకరాలు కట్టబెట్టారని వెల్లడించారు. అక్కడ ఉన్న గుడిని, పెద్ద హెరిటేజ్ రాళ్లను పగులగొట్టి, వేలకోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసారని, ఇప్పుడు వందల కోట్ల రూపాయల భూములను టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పేరుమీద దోచుకుతింటున్నారని. ప్రజలు ఈ అరాచకాలను గ్రహించాలని డా.దాసోజు శ్రవణ్ విజ్ఞప్తి చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+