టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ ఇదే: ఛైర్మన్గా కేకే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధినేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక, పార్టీ తరపున పోటీ చేసే 105మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.
ముందస్తు ఎన్నికలు: కేసీఆర్ ప్రకటించిన 105మంది అభ్యర్థులు వీరే
ఈ క్రమంలో గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీనియర్ ఎంపీ కే కేశవరావు అధ్యక్షతన ఎన్నికల మేనిఫెస్టో కమిటీని సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యలుగా కె.కేశవరావు(ఛైర్మన్), ఏపీ జితేందర్రెడ్డి, జి.నగేష్, ఈటల రాజేందర్, టి.హరీష్రావు, జి.జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, అజ్మీర చందూలాల్, టి. పద్మారావు, కొప్పుల ఈశ్వర్, పల్లా రాజేశ్వర్రెడ్డి, ఫరీదుద్దీన్, పి.రాములు, గుండు సుధారాణి ఉన్నారు.