"ఎవడో అన్నాడని.. రేవంత్! పిచ్చికూతలు మానుకో.. జైలుకెళ్లడం ఖాయం"
ఒకే దేశం ఒకే పన్ను విధానంతో ముందుకెళ్తున్న ఎన్డీయే.. టీఆర్ఎస్ అందుకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జీఎస్టీ అమలు చేయాలన్న పట్టుదలతో ఉందని, అందువల్లే పన్నుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు.
హైదరాబాద్: జీఎస్టీ విషయంలోను, నోట్ల రద్దు సమయంలోను కేంద్రంతో తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరు పట్ల టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓవైపు ఆర్థికమంత్రిని అభినందిస్తూనే.. సీఎం తీరును మాత్రం ఆయన తప్పుపట్టారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా టీఆర్ఎస్ నుంచి కౌంటర్ పడింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రేవంత్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యానే టీఆర్ఎస్ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. ఒకే దేశం ఒకే పన్ను విధానంతో ముందుకెళ్తున్న ఎన్డీయే.. టీఆర్ఎస్ అందుకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జీఎస్టీ అమలు చేయాలన్న పట్టుదలతో ఉందని, అందువల్లే పన్నుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు.

టీడీపీ నేతలు పిచ్చికూతలు మానుకోవాలని పల్లా రేవంత్ ను హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ను సీబీఐ విచారించిందంటూ ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఆధారాలు బయటపెట్టి మాట్లాడాలని డిమాండ్ చేశారు. రోడ్డు మీద ఎవడో ఏదో అన్నాడని.. దానికి మేము స్పందించాలా? అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి మళ్లీ జైలుకెళ్లడం ఖాయమని పల్లా అన్నారు. సీఎం కేసీఆర్ మీద, టీఆర్ఎస్ పార్టీ మీద రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తున్నామని తెలిపారు. టీడీపీ నేతలు అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని, జాతీయ పార్టీగా చెప్పుకునే పార్టీకి రాష్ట్రాల వారీగా విధానాలుంటాయా? అని నిలదీశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సూచన మేరకే ప్రధాని మోడీ రాష్ట్ర అభ్యర్థిగా కోవింద్ ను ఎంపిక చేశారు.
-
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications