జాగృతి తల్లిగారిల్లు.. టీఆర్ఎస్ అత్తగారిల్లు.. : ఎంపీ కవిత సరదా వ్యాఖ్యలు
హైదరాబాద్ : తెలంగాణ జాగృతి ఏర్పాటుతో తెలంగాణ ఆడపడుచుల్లో ప్రత్యేక ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్న టీఆర్ఎస్ ఎంపీ కవిత రాజకీయాల్లోను తనదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే. తాజాగా తన రాజకీయాలపై సరదా వ్యాఖ్యలు చేసిన ఎంపీ కవిత.. తనకు జాగృతి తల్లి గారి ఇల్లయితే టీఆర్ఎస్ అత్తగారిల్లు లాంటిదని ఛమత్కరించారు.
తెలంగాణ ప్రజలు కూడా జాగృతి నాయకురాలిగానే తన పట్ల ఎక్కువ ఆప్యాయత కనుబరుస్తారని చెప్పారు ఎంపీ కవిత. జాగృతిలో వేరే పార్టీ నేతలున్నా తామెలాంటి అభ్యంతరం చెప్పలేదని తెలిపారు. ఇకపోతే తెలంగాణ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించిన కవిత.. ఆంధ్రా పాలకుల హయాంలో ఏళ్ల తరబడి ప్రాజెక్టులు పెండింగ్ లోనే ఉన్నాయని, ప్రొఫెసర్ కోదండరాం లాంటి మేధావులు వాటిపై అధ్యయనం చేసి మాట్లాడాలని సూచించారు.

ప్రాజెక్టులపై ఇష్టారాజ్యంగా మాట్లాడితే ప్రజల్లో జేఏసీ పై ఉన్న విశ్వాసం తగ్గిపోతుందన్న కవిత.. ఇదే తరహాలో వ్యవహరిస్తే జేఏసీ ని కొనసాగించడం కంటే ఓ రాజకీయ పార్టీని పెట్టుకుంటే సరిపోతుందని వ్యాఖ్యానించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications