కోట్లు ఎగ్గొట్టి బెదిరిస్తున్నాడు, అందుకే ఆత్మహత్యాయత్నం: టీఆర్ఎస్ విప్ కొడుకుపై ఆరోపణలు
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కుమారుడు నల్లాల క్రాంతి తమను ఆర్థికంగా దెబ్బతీశాడని ఆరోపిస్తూ ఆ కుటుంబం ఆత్మహత్యకు ప్రయత్నించింది.
వివరాల్లోకి వెళ్తే.. పసునూటి అరవింద్ మంచిర్యాలలో షాపింగ్ మాల్స్ సహా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. అరవింద్కు చెందిన స్వర్ణమయి షాపింగ్మాల్ను 2016 అక్టోబర్లో క్రాంతి రూ. కోటీ 10లక్షలకు కొనుగోలు చేశాడు.

కొనుగోలు చేసి దాదాపు 16నెలలు గడిచిపోయినా.. ఇప్పటికీ డబ్బు ఇవ్వలేదని అరవింద్ ఆరోపిస్తున్నారు. అలాగే ప్రభుత్వం పలు గ్రామాల్లో వేయించిన బోర్వెల్స్ కోసం అరవింద్ తండ్రి సాంబయ్యకు చెందిన బోర్ వెల్ మిషనరీని క్రాంతి ఉపయోగించాడు.
ఇందుకు గాను క్రాంతి నుంచి రూ.2కోట్లు రావాల్సి ఉంది. మొత్తం రూ.3.10కోట్లు క్రాంతి నుంచి రావాలని అరవింద్ చెబుతున్నారు. తమను ఆర్థికంగా ముంచడమే గాక బెదిరింపులకు పాల్పడుతుండటంతో.. భార్య స్వర్ణ, కుమారుడితో కలిసి మంచిర్యాల రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు యత్నించినట్టు తెలిపారు. స్థానికులు వారిని కాపాడి పోలీసులకు సమాచారం అందించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications