వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎగ్జిట్ పోల్స్: టీఆర్ఎస్‌దే విజయం, రెండో ప్లేస్‌లో బీజేపీ

|
Google Oneindia TeluguNews

మునుగోడు బై పోల్ ముగిసింది. భారీగా పోలింగ్ శాతం నమోదైంది. ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. దాదాపు అన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు నిలిచాయి. బీజేపీ రెండో స్థానంలో నిలుస్తుందట. కానీ బీజేపీ మాత్రం తమకే విజయ అవకాశాలు అని అంటోంది. మెజార్టీ పోల్స్ మాత్రం గులాబీ దండుదే విజయం అని అంటోంది.

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో అధికార టీఆర్ఎస్ 40.9 శాతం ఓట్లతో విజయం సాధిస్తుందని తేలింది. బీజేపీకి 31 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 23 శాతం ఓట్లు, బీఎస్పీకి 3.2 శాతం ఓట్లు, ఇతరులకు 1.9 శాతం ఓట్లు వచ్చాయి. మిగతా సంస్థలు కూడా దాదాపు ఇలానే చెప్పాయి.

trs will win munugode by poll:exit polls

త్రిశూల్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఏకంగా 47 శాతం ఓట్లు రాగా బీజేపీకి 31 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 18 శాతం ఓట్లు, ఇతరులకు 4 శాతం ఓట్లు రానున్నట్లు తేలింది.

ఇక పల్స్ టుడే విషయానికి వస్తే టీఆర్ఎస్ పార్టీకి 42 నుంచి 43 వరకు, బీజేపీకి 38.5 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ 14 నుంచి 16 శాతం, బీఎస్పీ 3 శాతం, ఇతరులు 1 శాతం ఓట్లు పడతాయట. ఎస్ఏఎస్ గ్రూప్ టీఆర్ఎస్ 41 శాతం, బీజేపీ 35 శాతం వస్తాయని తెలిపింది.

నేషనల్ ఫ్యామిలీ టీఆర్ఎస్ 42.11 శాతం, బీజేపీ 35. 17 శాతం ఓట్లు రాబడతాయని తెలిపింది. ఇక నాగన్న టీఆర్ఎస్ పార్టీకి 48 నుంచి 51 శాతం ఓట్లు, బీజేపీ 31 నుంచి 35 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంటుందని తెలిపింది.

English summary
trs will win munugodu by poll exit polls reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X