ఎగ్జిట్ పోల్స్: టీఆర్ఎస్దే విజయం, రెండో ప్లేస్లో బీజేపీ
మునుగోడు బై పోల్ ముగిసింది. భారీగా పోలింగ్ శాతం నమోదైంది. ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. దాదాపు అన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు నిలిచాయి. బీజేపీ రెండో స్థానంలో నిలుస్తుందట. కానీ బీజేపీ మాత్రం తమకే విజయ అవకాశాలు అని అంటోంది. మెజార్టీ పోల్స్ మాత్రం గులాబీ దండుదే విజయం అని అంటోంది.
తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో అధికార టీఆర్ఎస్ 40.9 శాతం ఓట్లతో విజయం సాధిస్తుందని తేలింది. బీజేపీకి 31 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 23 శాతం ఓట్లు, బీఎస్పీకి 3.2 శాతం ఓట్లు, ఇతరులకు 1.9 శాతం ఓట్లు వచ్చాయి. మిగతా సంస్థలు కూడా దాదాపు ఇలానే చెప్పాయి.

త్రిశూల్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఏకంగా 47 శాతం ఓట్లు రాగా బీజేపీకి 31 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 18 శాతం ఓట్లు, ఇతరులకు 4 శాతం ఓట్లు రానున్నట్లు తేలింది.
ఇక పల్స్ టుడే విషయానికి వస్తే టీఆర్ఎస్ పార్టీకి 42 నుంచి 43 వరకు, బీజేపీకి 38.5 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ 14 నుంచి 16 శాతం, బీఎస్పీ 3 శాతం, ఇతరులు 1 శాతం ఓట్లు పడతాయట. ఎస్ఏఎస్ గ్రూప్ టీఆర్ఎస్ 41 శాతం, బీజేపీ 35 శాతం వస్తాయని తెలిపింది.
నేషనల్ ఫ్యామిలీ టీఆర్ఎస్ 42.11 శాతం, బీజేపీ 35. 17 శాతం ఓట్లు రాబడతాయని తెలిపింది. ఇక నాగన్న టీఆర్ఎస్ పార్టీకి 48 నుంచి 51 శాతం ఓట్లు, బీజేపీ 31 నుంచి 35 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంటుందని తెలిపింది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications