హైదరాబాదీలకు అందుబాటులోకి ట్రంపెట్ ఇంటర్ చేంజ్..శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు 20 నిముషాల్లోనే!
హైదరాబాద్ వాసులకు శుభవార్త. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్న మన ప్రభుత్వం భాగ్యనగర్ వాసులకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ కోకాపేట వద్ద నిర్మించిన ట్రంపెట్ ఇంటర్ చేంజ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
కోకాపేట నియోపోలీస్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వన్ఏ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామితోపాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరవాసులు ట్రాఫిక్ తో పడే ఇబ్బందులు అన్నిఇన్ని కాదు. ఈ క్రమంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లడానికి ట్రాఫిక్ సమస్య లేకుండా ఈజీగా వెళ్లడానికి అవకాశం ఉంటుంది.

నియో పోలీస్ లేఅవుట్ నుండి నేరుగా అవుటర్ రింగ్ రోడ్డు కు కనెక్ట్
ఈ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ నియో పోలీస్ లేఅవుట్ నుండి నేరుగా అవుటర్ రింగ్ రోడ్డు కు కనెక్ట్ అవుతుంది. దీనివల్ల శంషాబాద్ విమానాశ్రయానికి గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆయన సమయం గణనీయంగా తగ్గుతుంది. గతంలో 45 నిమిషాల నుండి ఒక గంట సమయం పట్టే ప్రయాణం ఇప్పుడు కేవలం 20 నిమిషాలకే తగ్గింది. ఈ మార్గంలో ప్రయాణం చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య ఉండదు. టైం సేవ్ అవుతుంది.
ఔటర్ రింగ్ రోడ్డు పైకి ఈజీగా వెళ్లడానికి అవకాశం
ఈ ట్రంపెట్ జంక్షన్ ఔటర్ రింగ్ రోడ్డు ను నియో పోలీస్ లేఔట్ తో నేరుగా అనుసంధానం చేస్తుంది ఇది 1.27 కిలోమీటర్ల పొడవుతో నాలుగు వరుసలతో కూడిన రహదారి. ఇందులో ప్రధాన ట్రంపెట్ స్ట్రెచ్ 600 మీటర్లు ఉంటుంది. మిగిలినదంతా సర్వీస్ రోడ్డుగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా నియో పోలీస్, శంకర్పల్లి ప్రాంతాలకు చెందిన ప్రజలు ఔటర్ రింగ్ రోడ్డు పైకి ఈజీగా వెళ్లడానికి అవకాశం ఉంటుంది.
ట్రంపెట్ ఇంటర్ చేంజ్ తో ఈ ప్రాంత వాసుల ట్రాఫిక్ సమస్యకు చెక్
ప్రస్తుతం ఈ ట్రంపెట్ జంక్షన్ నిర్మాణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 65 కోట్ల రూపాయలను కేటాయించింది. నియో పోలీస్ లేఅవుట్ అభివృద్ధికి 450 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. నియో పోలీస్ లేఔట్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రాంతం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. కోకాపేట రియల్ ఎస్టేట్ రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడం కోసం హెచ్డిఎంఏ నిర్ణయాలు తీసుకుని లింక్ రోడ్ లను ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత వాసులకు ట్రాఫిక్ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తోంది.
-
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
ఉచిత బస్సే జిందా తిలిస్మాత్ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్ను చిత్తు చేసిన సన్రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!!












Click it and Unblock the Notifications