అంబర్పేటలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం: విచారణకు ఆదేశం, ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
హైదరాబాద్: అంబర్పేట పరిధిలోని రామాంతపూర్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థి టీసీ గురించి మాట్లాడుదామని ప్రిన్సిపాల్ గదికి వెళ్లిన ఓ విద్యార్థి నాయకుడు తనతోపాటు తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకున్నాడు. పక్కనే దీపం ఉండటంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి, ఏవో అశోక్ రెడ్డికి గాయాలయ్యాయి. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. ఫీజు చెల్లించలేదనే కారణంతోనే బాధిత విద్యార్థికి టీసీని కాలేజీ యాజమాన్యం ఇవ్వలేదని సమాచారం.
కాగా, ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డు కార్యదర్శికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

మరోవైపు, ఈ ఘటన నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్ కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపవద్దని కాలేజీలకు ఆదేశాలు జారీ చేశారు. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ దేనని స్పష్టం చేశారు. కారణమేదైనా విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపడానికి వీల్లేదని తేల్చిచెప్పారు.
సర్టిఫికెట్లు ఇవ్వకపోతే డీఐఈవో, ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అంతేగాక, ప్రైవేటు కాలేజీలు తనిఖీ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications