హైదరాబాద్-విజయవాడ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్: ఈ-గరుడ బస్సు ఛార్జీలు తగ్గింపు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ(TSRTC) శుభవార్త అందించింది. టీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఈ-గరుడ బస్సుల ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ప్రారంభ ఆఫర్ కింద ఈ-గరుడ బస్సుల ఛార్జీలను తగ్గించినట్లు తెలిపారు. అయితే, ఈ ఆఫఱ్ నెల రోజుల వరకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.
మియాపూర్ - విజయవాడ ఛార్జీ రూ. 830 ఉండగా.. దీన్ని రూ. 760కి తగ్గించారు. ఎంజీబీఎస్ - విజయవాడ ఛార్జీ రూ. 780 ఉండగా.. దీన్ని రూ. 720కి తగ్గించినట్లు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ మియాపూర్లో 10 ఈ -గరుడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్తో కలిసి ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ ఏడాదిలోగా హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపనున్నారు. 20 నిమిషాలకో ఈ-గరుడ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించారు. హైదరాబాద్ నగరం నుంచి నిత్యం 50 వేల మంది విజయవాడ, రాజమండ్రికి ప్రయాణిస్తున్నారని, అందుకే తొలుత ఈ-గరుడ బస్సులను విజయవాడకు నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
బస్సులు బయలుదేరు సమయాలివే:
మియాపూర్ నుంచి: 6.25, 8.25, 10.25, 18.05, 19.45, 21.45 గంటలకు ఈ-గరుడ బస్సులు బయలుదేరుతాయి.
ఎంజీబీఎస్ నుంచి: 8.10, 10.10, 12.10, 19.50, 21.30, 23.30 గంటలకు ఈ-గరుడ బస్సులు బయలుదేరుతాయి.
విజయవాడ నుంచి: 6.20, 8.00, 10.00, 18.40, 20.40, 22.40 గంటలకు ఈ-గరుడ బస్సులు బయలుదేరుతాయి.
ఇది ఇలావుండగా, వచ్చే రెండేళ్లలో 1,860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మంగళవారం వెల్లడించారు. ఈ-బస్సులను మంగళవారం ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రైవేటు బస్ సర్వీస్లకు దీటు గా అత్యాధునిక సౌకర్యాలతో ఈ బస్సులను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. పర్యావరణ అనుకూల ప్రజారవాణా కోసం ఆర్టీసీ ఈ-గరుడ బస్సులను అందుబాటులోకి తేవడం అభినందనీయమని కొనియాడారు. ఈ ఏడాదిలోగా హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపనున్నట్టు తెలిపారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications