షిర్డీ, చెన్నైతోపాటు ఏపీలోని ఈ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
హైదరాబాద్: ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో పలు మార్గాల్లో ప్రత్యేక సర్వీసులను నడపాలని నిర్ణయించింది. షిర్డీ, చెన్నైతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు నగరాలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ మేరకు వివరాలను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
'ప్రయాణికులకు శుభవార్త! వరుస సెలవుల నేపథ్యంలో ఈ రోజు, రేపు సుదూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి చెన్నై, షిర్దీ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులను సంస్థ నడుపుతోంది. ప్రయాణికులు అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in లో టికెట్లను బుకింగ్ చేసుకోగలరు. పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించగలరు' అని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.

మరోవైపు, అరుణాచల గిరి ప్రదిక్షణకై తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా, వచ్చే పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 29న ప్రత్యేక ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు 99599 సర్వీస్ నెంబర్తో సత్తుపల్లి నుంచి ప్రారంభిస్తోంది. మూడు రోజులతో కూడిన అరుణాచల గిరి ప్రదక్షిణలో శ్రీకాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దేవాలయాలు సందర్శిస్తూ.. అరుణాచల గిరి ప్రదక్షిణ చేయవచ్చు అని టీఎస్ఆర్టీసీ తెలిపింది. టికెట్ ధర కేవలం రూ. 3330 మాత్రమేనని పేర్కొంది.
టీఎస్ఆర్టీసీలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ ప్రయాణికులకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో 1300 ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తీసుకురావాలని TSRTC నిర్ణయించింది. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతుంది. త్వరలో 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వాడకంలోకి తెచ్చేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications