టీఎస్ఆర్టీసీ సమ్మె, హైకోర్టు కీలక ఉత్తర్వులు.. సీఎస్తో పాటు ఉన్నతాధికారులు కోర్టుకు ..
ఆర్టీసీ సమ్మెపై సమగ్ర విచారణ జరిపేందుకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. గత నెలరోజులుగా జరుగుతున్న సమ్మెకు కోర్టుపరంగా ఫుల్స్టాప్ పెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చెబుతున్న లెక్కలపై పూర్తి వివరాలను తీసుకుని విచారణ జరిపేందుకు సిద్దమయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ఇతర విభాగాల ఉన్నతాధికారులు కోర్టుకు హజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

సీఎస్ ఇతర ఉన్నతాధికారులు కోర్టు ఉత్తర్వులు
ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు అధికారులకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర సమచారంతో సీఎస్ ఎస్కే జోషి, ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్శర్శ ,ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావుతోపాటు జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్కుమార్లు ఈ నెల ఏడవ తేదిన కోర్టులో హజరు కావాలని అదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఆయా విభాగాలు కోర్టుకు సమర్పించిన నివేదికలు విరుద్దంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. దీంతో పూర్తివాస్తవాలను ఈనెల ఆరవతేదీల్లోగా సమర్పించాలని ఆదేశించింది.

వాస్తవానికి విరుద్దంగా నివేదికలు
ఆర్టీసీ సమ్మెపై నవంబర్ 1న జరిగిన విచారణలో ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు అఫిడవిట్ను దాఖలు చేశారని హైకోర్టు అభిప్రాయపడిన నేపథ్యంలోనే విచారణ సమయంలో కూడ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సునిల్ శర్మ ఇచ్చి నివేదికలో వాస్తవాలకు విరుద్దంగా ఉన్నాయని కోర్టు తెలిపింది. దీంతో పాటు రవాణాశాఖ మంత్రికి ఆర్టీసీ ఇచ్చిన నివేదిక కూడ ఇందుకు విరుద్దగా ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈనెల 6వ తేదిలోగా సమగ్ర సమాచారాన్ని కోర్టుకు సమర్పించాలని సునిల్ శర్మను ఆదేశించింది.

బకాయిలపై వివరణ
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు కూడ సమాచారం కూడ అసమగ్రంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలపై వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే 2014 నుండి గత నెల వరకు ప్రభుత్వం చెల్లించాల్సిన వివరాలు ఇవ్వాలని కోరింది. మరోవైపు ఆర్టీసీకి జీహెచ్ఎంసీ ఎంత బకాయిపడిందో వివరాలు తెలపాలని కోరింది. ఈ సంవత్సరం బకాయిలను చెల్లించాలని జీహెచ్ఎంసీని కోరిందా..లేకుండా ఎందుకు అడగలేదో వివరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈనేపథ్యంలోనే మరోసారి ఈనెల 7వ తేదిన సమగ్ర విచారణ జరపనుంది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications