కవిత ఇలాకాలో కమలం జోరు.. నిజామాబాద్లో బీజేపీ పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన...
నిజామాబాద్ లో రసవత్తర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కవిత ఇలాకాలో కమలం దూకుడు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఒకపక్క పసుపు, ఎర్ర జొన్న రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున ఎన్నికల బరిలోకి దిగారు రైతన్నలు. సమస్య తీవ్రత దృష్ట్యా ఎన్నికల సమయంలో కీలక ప్రకటన చేశారు బిజెపి నాయకులు రామ్ మాధవ్.

బీజేపీ పసుపు బోర్డు అస్త్రం ... ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతుల అంశం
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు అంశాన్ని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని బిజెపి జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ తెలిపారు. నిజామాబాద్ బిజెపి అభ్యర్థి అరవింద్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాం మాధవ్ ప్రభుత్వ వైఫల్యం వల్లే నిజామాబాద్ లో పెద్ద ఎత్తున రైతులు నామినేషన్లు దాఖలు చేసి బ్యాలెట్ వార్ కు తెరతీశారని ఆయన అన్నారు. రైతుల పక్షాన బిజెపి ప్రభుత్వం నిలబడుతుందని చెప్పిన రామ్ మాధవ్ పసుపు బోర్డు ఏర్పాటుకు బిజెపి సర్కార్ కృతనిశ్చయంతో ఉందని తెలిపారు.

బీజేపీ ప్రకటన కవితకు ఇబ్బందికర పరిణామం
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పసుపు బోర్డును ఏర్పాటు చేసి తీరుతామని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామారావు తెలిపారు. అలాగే పసుపు, ఎర్ర జొన్న, చెరకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం బిజెపి కృషి చేస్తుందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో రైతన్నల ఓటు బ్యాంకు టార్గెట్ గా బిజెపి చేసిన ప్రకటన ఎంపీ కవిత కు ఇబ్బందికర పరిణామం గా మారుతోంది.

రైతులు నామినేషన్లు వెయ్యకుండా సమస్య పరిష్కరించటంలో కవిత విఫలం
మొదటి నుంచి రైతులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ రైతులు మాత్రం నామినేషన్లు వేశారు. అంతేకాదు నామినేషన్లు ఉపసంహరించుకోకుండా తీర్మానాలను సైతం చేశారు. ఇక ఇదే అదునుగా బిజెపి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే పసుపు బోర్డు ఏర్పాటుపై తమ నిర్ణయాన్ని ప్రకటన చేసింది.

నిజామాబాద్ లో కమల దండు దూకుడు .. కవిత కు కాస్త కష్టమే
అంతేకాకుండా బిజెపి నుండి ఎన్నికల బరిలోకి దిగిన అరవింద్ ఇప్పటికే చాపకింద నీరులా నిజామాబాద్ లోక్సభ స్థానాన్ని టార్గెట్ గా పెట్టుకుని పని చేస్తున్నారు. ఈ క్రమంలో కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత కు గత ఎన్నికల తరహాలో విజయం అంత సునాయాసం కాదనేది అర్థమవుతోంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోనూ లోక్ సభ ఎన్నికల్లో కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది బిజెపి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications