టీవీ9లో కొత్త ట్విస్టులు: ముగిసిన రవిప్రకాశ్ శకం? కొత్త సీఈవో నియామకం! ఎవరి వాదన ఏంటీ?
హైదరాబాద్ : ఉత్కంఠ రేపిన టీవీ 9 ఇష్యూ ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. అలంద మీడియా ఆరోపణలు, కేసు కంప్లైంట్తో వెనక్కి తగ్గిన రవిప్రకాశ్ కాసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చారు. టీవీ 9 సీఈవో పదవీనుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఇటు రవిప్రకాశ్ ఆరోపణలు ఏబీసీఎల్ తోసిపుచ్చింది. అవకతవకలకు పాల్పడినందునే తప్పించినట్టు స్పష్టంచేసింది.

దొడ్డిదారిన చొరబడి కంపెనీని లాక్కున్నారు
రాజకీయ నేతల అండదండలతో జర్నలిజాన్ని నాశనం చేసే లక్ష్యంతో కొందరు పనిచేస్తున్నారని రవిప్రకాశ్ విమర్శించారు. మోసం, వంచన పేరుతో కొందరు టీవీ 9లో చొరబడ్డారని ఆరోపించారు. తప్పుడు ఫిర్యాదులు, కేసులతో వేధించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఎన్ఎల్సీటీ కరకటు ఆదేశాన్ని ధిక్కరిస్తూ సంస్థలో మార్పులు చేపట్టారని మండిపడ్డారు. ప్రొఫెషనల్ కంపెనీ సెక్రటరీని బెదిరించి ఏబీసీఎల్ డైరెక్టర్ల మీద తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు. రిజిస్టార్ ఆఫ్ కంపెనీలో దొడ్డిదారిన నలుగురు డైరెక్టర్లన చొప్పించి పోలీసుల సహాయంతో టీవీ9ను ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు.

బెదిరించి, భయపెట్టారు
తప్పుడు కేసులతో వేధించే ప్రయత్నం చేశారని .. మీడియాలో అసత్యం ప్రచారం చేశారని రవిప్రశాక్ పేర్కొన్నారు. టీవీ 9 సిబ్బందిని వేధించి, దాడులకు గురిచేసి భయపెట్టారని .. బలవంతంగా కంపెనీకి చేతుల్లోకి తీసుకున్నారని రవిప్రకాశ్ వాపోయారు. అక్రమాలు, అన్యాయాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా షేర్ హోల్డర్ మీతోనే ఉంటానని పేర్కొన్నారు. జర్నలిజాన్ని కాపాడటానికి, పాత్రికేయ విలువలను రక్షించడానికి మీడియా సంస్థల్లో రాజకీయ జోక్యాన్ని నిలువరించడానికి ప్రయత్నిస్తానని స్పష్టంచేశారు.

అక్రమాలు వెలుగులోకి రావడంతోనే ...
రవిప్రకాశ్ మీడియా సమావేశం తర్వాత బోర్డు కూడా స్పందించింది. టీవీ 9లో రవిప్రకాశ్ కు 8, మరో ప్రతినిధి ఒకటిన్నర శాతం వాటా ఉందని తెలిపింది. తొమ్మిదిన్నర వాటాతో టీవీ 9 సంస్థలో అక్రమాలకు, ఫోర్జరీ చేశారని అలంద మీడియో పేర్కొంది. ఈ మేరకు ఆయనపై వేటు వేయాలని ఏబీసీఎల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది.

సీఈవోగా మహేంద్ర
టీవీ 9 సీఈవోగా రవిప్రకాశ్ ను తప్పించిన తర్వాత ఏబీసీఎల్ డైరెక్టర్స్ బోర్డు కొత్త సీఈవో, సీవోవోను నియమించింది. సీఈవోగా మహేంద్ర మిశ్రాను బాధ్యతలు అప్పగించింది ఆయన ప్రస్తుతం టీవీ 9 కన్నడ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సీవోవోగా గొట్టిపాటి సింగారావును నియమించింది. ఈయన ప్రస్తుతం 10 టీవీ సీఈవోగా పనిచేస్తున్నారు.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications