టీవీ ఛానల్ కెమెరామెన్, భార్య ఆత్మహత్య: 2 నెలల క్రితమే పెళ్లైంది
హైదరాబాద్: భాగ్యనగరంలోని వనస్థలిపురంలో ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను రాజీవ్, కవితలుగా మంగళవారం నాడు గుర్తించారు. రాజీవ్ ఓ టీవీ ఛానల్లో కెమెరామెన్గా పని చేస్తున్నారని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్నారు. వీరికి రెండు నెలల క్రితం వివాహం జరిగింది. రాజీవ్, కవితలు నల్గొండ జిల్లా చౌటుప్పల్కు చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

కనుమూరి ఇంట్లో కారు, ఆభరణాలు మాయం
మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లోని ఆభరణాలతో పాటు ఇంటి ముందున్న ఇన్నోవా వాహనాన్ని తీసుకొని పరారయ్యారు. బంజారాహిల్స్ రోడ్ నం.12 ఎమ్మెల్యే కాలనీలో కనుమూరి బాపిరాజు నివసిస్తున్నారు.
ఈ నెల 5న అర్ధరాత్రి 2 గంటల తరువాత ఆయన ఇంట్లోకి గుర్తు తెలియని ఆగంతకులు వచ్చారు. వెనుక తలుపు ద్వారా లోపలికి ప్రవేశించారు. అల్మారాలో పెట్టిన దాదాపు రూ.5 లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలు, అక్కడే ఉన్న ఇన్నోవా తాళం చెవిని తీసుకుని ఇంటి ముందున్న వాహనంతో వెళ్లిపోయారు. బాపిరాజు కోడలు చైతన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications