కిలాడీ గర్ల్స్: సుందరాంగుల ఫొటోలు పెట్టి కుర్రాళ్లకు వల
హైదరాబాద్: ఫేస్బుక్ను వేదికగా చేసుకుని అబ్బాయిలకు వలవేసి డబ్బులు లాగుతున్న ఇద్దరు కిలాడీ అమ్మాయిలను గుట్టును హైదరాబాదు పోలీసులు విప్పారు. ఇద్దరు అమ్మాయిలు కలిసి ఒక్కొక్కరూ ఫేస్బుక్లో 15 నుంచి 20 అకౌంట్లు తయారు చేసుకున్నారు.
వాటికి అందమైన అమ్మాయిలను ఫొటోలను తమ ప్రొఫైల్ ఫొటోల్లా పెట్టారు. ఆ ఫొటోలు చూసి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిన అబ్బాయిలను అందరినీ వారు ఫ్రెండ్స్గా యాడ్ చేసుకున్నారు. తమ ఫోన్ నెంబర్లను కూడా అందులో పెట్టి అబ్బాయిలకు గాలం వేశారు. వారి వలలో చాలా మంది యువకులు పడ్డారు.
అబ్బాయిలు వేలకు వేలు వారికి సమర్పించుకున్నారు. ఓ కుర్రాడు ఏకంగా తన దగ్గర ఉన్న రూ.40 వేల విలువ చేసే కెమెరానే ఇచ్చేశాడు. ఇద్దరు అమ్మాయిలు కలిసి వందల మంది అబ్బాయిలను మోసం చేశారు. బాధితులంతా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
అందుకు సంబంధించిన వివరాలను డిసిపి సత్యనారాయణ వివరించరాు. వీలైనంత మేరకు ఏయే సెక్షన్లు వర్తిస్తాయో ఎన్ని కేసులు పెట్టవచ్చునో అన్నీ పెడుతామని ఆయన చెప్పారు. వారు కచ్చితంగా ఎంత మంది వద్ద డబ్బులు తీసుకున్నది తెలియదని అన్నారు.
సోమవారంనాడు 17 మంది యువకులను పిలిపించి విచారించారు. ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా ఇంట్లోంచి పారిపోయి హైదరాబాద్ వచ్చి ఇలాంటి మోసానికి పాల్పిడనట్లు, మిస్సింగ్ కేసు అనుకుని విచారిస్తే అసలు విషయం తెలిసిందని పోలీసులు అంటున్నారు.