మత్తు వీడటం లేదు: గంజాయి సేవిస్తున్న లేడీ టెక్కీ, మరో యువతి అరెస్ట్
ఓ వైపు డ్రగ్స్ కేసులో పోలీసులు విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నా.. మరో వైపు యువత మాత్రం మత్తుును వీడటం లేదు. తాజాగా, కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలేషియన్ టౌన్ షిప్లో గంజాయి .
హైదరాబాద్: ఓ వైపు డ్రగ్స్ కేసులో పోలీసులు విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నా.. మరో వైపు యువత మాత్రం మత్తుును వీడటం లేదు. తాజాగా, కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలేషియన్ టౌన్ షిప్లో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువతులు, ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.
తమకందిన సమాచారం మేరకు పోలీసులు టౌన్ షిప్లోని బ్లాక్ నంబర్ 17 ఫ్లాట్ నంబర్ 103 పై తనిఖీ చేశారు. ఆ ఫ్లాట్లో గంజాయి సేవిస్తున్న ఎక్తా నేగి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగితో పాటు గోపీ సాధన అనే ఫ్యాషన్ డిజైనర్ను అదుపులోకి తీసుకున్నారు.
యువతులు ఇచ్చిన సమాచారం మేరకు అదే టౌన్ షిప్లోని బ్లాక్ నంబర్ 27లోని ఫ్లాట్ నంబర్ 304లో గంజాయి సేవిస్తున్న మువ్వ నితిన్, దేవరాజు ఉదయ్, మారుపల్లి అభిలాష్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
వీరి వద్ద నుంచి 60 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. వీరు టోలీచౌకీలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేశారని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు యువతులు, ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.