ఫెయిల్: మనస్తాపంతో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య
వరంగల్: ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపానికి గురైన ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ నగరం కాజీపేట విష్ణుపురిలో నివాసముండే పల్లగాని గురుప్రసాద్, రమ దంపతుల పెద్ద కూతురు రచన(18) నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది.
ఇటీవల ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయగా సోమవారం ఫలితాలు వెల్లడయ్యాయి. పరీక్షల్లో ఫెయిలవడంతో మనస్తాపానికి గురైన రచన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

మరో ఘటనలో దేవరుప్పుల మండలం చిన్నమడూరుకు చెందిన రాజేందర్, జయమ్మ దంపతుల ఏకైక కూతురు రేషపల్లి ఆశ్విని(21)ని కడవెండికి చెందిన భానుచందర్కు ఇచ్చి ఏడాది క్రితం పెళ్లి చేశారు.
వివాహం తర్వాత కూడా ఆశ్విని చదువుపై ఆసక్తితో జనగామలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదివి పరీక్షలకు హాజరరైంది. సోమవారం ఫలితాల్లో అశ్విని ఫెయిలవడంతో మనస్తాపంతో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications