సెల్పీ దిగి వేధింపులకు పాల్పడ్డాడు, బాధితురాలు ఏం చేసిందంటే?
క్లాస్ మేట్ తో సెల్పీ దిగి, ఈ సెల్పీను అడ్డుపెట్టుకొని పెళ్ళిచేసుకోవాలని వేధిస్తున్న యువకులను హైద్రాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు.మరో యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు.
హైదరాబాద్: క్లాస్ మేట్ తో సెల్పీ దిగి, ఈ సెల్పీను అడ్డుపెట్టుకొని పెళ్ళిచేసుకోవాలని వేధిస్తున్న యువకులను హైద్రాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు.మరో యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు.
హైద్రాబాద్ లోని దిల్ సుఖ్ నగర్, కొత్త పేట మహాలక్ష్మీనగర్ కాలనీకి చెందిన జొన్న వెంకటనాగసాయికృష్ణగౌడ్ తన క్లాస్ మేట్ తో రెండేళ్ళ క్రితం పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ కలిసి సెల్పీ తీసుకొన్నారు.
అయితే ఈ యువతితో సాన్నిహిత్యాన్ని ఆసరాగా చేసుకొన్న నాగసాయికృష్ణగౌడ్ తనను పెళ్ళిచేసుకోవాలంటూ ఆ యువతిని వేధించేవాడు.అయితే ఆ యువతి మాత్రం ఇందుకు నిరాకరించింది. తనను పెళ్ళిచేసుకోవాలని కోరినా నిరాకరించడంతో ఆమెపై కక్షను పెంచుకొన్నాడు ఆ యువకుడు.
ఆ యువతితో కలిసి దిగిన సెల్పీ ఫోటోలను మన్సూరాబాద్ సహారా ఏస్టేట్ లో ఉంటున్న సిరనగండ్ల ప్రదీప్ కుమార్ ,రఘువీర్ లకు పంపాడు. దీంతో వీరిద్దరూ కూడ ఈ యువతిని వేధింపులకు గురిచేశారు.
ఈ వేధింపులను ఆ యువతి తల్లిదండ్రులకు వివరించింది. కుటుంబసభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదుచేసింది. పోలీసులు జొన్న వెంకటసాయికృష్ణగౌడ్ , సిరసనగండ్ల ప్రదీప్ కుమార్ లను అదుపులోకి తీసుకొన్నారు పోలీసులు. మరో యువకుడు బిన్ని పరారీలో ఉన్నట్టు ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు.