Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య: అసలేం జరిగింది?

తనను చేయని నేరానికి బలిపశువును చేశారంటూ ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ముందు అతడు ఓ వీడియో రికార్డు చేసి తన ఆత్మహత్యకు కారణమైన అధికారుల పేర్లను తెలిపాడు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఏనుకూరుకు చెందిన సాగర్‌ బూర్గంపాడు పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా సాగర్​ విధులు నిర్వహించాడు.

గతంలో బూర్గంపాడుకు చెందిన బీఆర్ఎస్​ నాయకుడు, అప్పటి ఎస్‌ఐతో సన్నిహితంగా ఉండి గంజాయి పక్కదోవపట్టించినట్టు ప్రచారం జరిగింది. ఈ గంజాయి కేసుకు సంబంధించి లావాదేవీలన్నీ సాగర్‌ సెల్‌ఫోన్‌ ద్వారా మాట్లాడే వారని తెలిసింది. అయితే, గంజాయి స్మగ్లింగ్​ కేసులో సాగర్‌ను పోలీసు అధికారులు 8 నెలల క్రితం సస్పెండ్‌ చేశారు.

Two police constables commits suicide in separate incidents in Telangana

చేయని తప్పునకు తనకు శిక్ష పడిన విషయంపై సాగర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పటి ఎస్‌ఐ బదిలీ అయిన తర్వాత ఎస్‌ఐగా వచ్చిన వారు వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని అమ్ముకొని తనను బలి పశువును చేశారంటూ సాగర్ సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి మరీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

తాను చేయని నేరానికి తనకు శిక్ష పడిన విషయంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యాను అని వీడియోలో సాగర్ తెలిపాడు. తనకు న్యాయం జరగదేమోననే ఆలోచనలో ఆత్మ హత్యాయత్నం చేశాడు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, సాగర్ సస్పెన్షన్ వ్యవహారం, ఇప్పుడు అతను ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. గంజాయి పక్కదోవ పట్టిన కేసులో అసలు ముద్దాయిలు ఎవరో తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సాగర్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అతడి కుటుంబసభ్యులు కోరుతున్నారు.

తుపాకీతో కాల్చుకుని మరో కానిస్టేబుల్ సూసైడ్

మరో ఘటనలో మహబూబూబాద్ జిల్లాలో ఏర్ కానిస్టేబుల్ జీ శ్రీనివాస్ తన తుపాకీతో కాల్చుకుని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్.. ఆదివారం సాయంత్రం తన వద్దనున్న గన్‌​తో కాల్చుకున్నాడు. పేలుడు శబ్జం రాగానే హుటాహుటిన పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకోగా.. అప్పటికే రక్తపు మడుగులో కానిస్టేబుల్ విగత జీవిగా పడివున్నాడు.

సమాచారం అందుకున్న వెంటనే మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ డేవిడ్​లు ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. శ్రీనివాస్​‌కు భార్య, కుమారుడు ఉన్నారు. 1990 బ్యాచ్‌​కు చెందిన శ్రీనివాస్.. గత ఐదు సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉంటున్నాడు. భార్యాబిడ్డలకు దూరమయ్యానన్న దిగులుతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తిరుపతి రావు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+