సెల్లార్ గోడ కూలి: ఇద్దరు మహిళల మృతి, శిథిలాల కింద మరికొందరు
హైదరాబాద్ నగరంలోని కొండాపూర్లో సోమవారం విషాద ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న సెల్లార్ గోడ కూలడంతో ఇద్దరు మహిళా కార్మికులు మృతి చెందారు. మృతులను భారతవ్వ(35), కిష్టవ్వ(23)లుగా గుర్తించారు.
హైదరాబాద్: నగరంలోని కొండాపూర్లో సోమవారం విషాద ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న సెల్లార్ గోడ కూలడంతో ఇద్దరు మహిళా కార్మికులు మృతి చెందారు. మృతులను భారతవ్వ(35), కిష్టవ్వ(23)లుగా గుర్తించారు.
కాగా, శిథిలాల కింద మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
విద్యార్థి ఆత్మహత్య
బాలాపూర్: హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఓ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మీర్పేట పోలీసుల కథనం ప్రకారం... నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ కుమారుడు ఎస్.చైతన్యకుమార్ (17), మీర్పేట ఆర్ఎన్రెడ్డినగర్లోని ఓ హాస్టల్లో ఉంటూ టీకేఆర్ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో స్నేహితులు ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదని పోలీసులు తెలిపారు.