దత్తాత్రేయకు అస్వస్థత: ముక్కు నుంచి రక్తస్రావం, ఆస్పత్రిలో చికిత్స
వరంగల్: బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. వరంగల్ లోకసభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారంనాడు బిజెపి నిర్వహించిన సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు.
ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న దత్తాత్రేయ ఒక్కసారిగా కుప్పకూలినట్లు చెబుతున్నారు. ఆయన ముక్కు నుంచి రక్తస్రావం జరిగినట్లు కూడా తెలుస్తోంది. దీంతో ఆయనను హుటాహుటిన సమీపంలో ఉన్న మ్యాక్స్ కేర్ ఆస్పత్రికి తరలించరాు.

ఆయనకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, బిజెపి, టిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు.
బుధవారంనాడు కాంగ్రెసు నాయకుడు గులాం నబీ ఆజాద్ కూడా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఇద్దరు ఎంపీలున్న తెలంగాణ రాష్ట్ర సమితి వల్ల తెలంగాణ రాష్ట్రం రాలేదని, తెలంగాణ కాంగ్రెసు నాయకుల కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన చెప్పారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications