'కేసీఆర్ ప్రారంభించిన డబుల్ బెడ్ ఇళ్లకు వాస్తు దోషం!'
వాస్తు దోషం కారణంగా ఆ ఇళ్లలో నివసించే ప్రజల ఆర్థికంగా, అనారోగ్యంగా చితికిపోతారని వాసవి వాస్తు ప్లానర్స్ అధినేత ప్రకాష్ పేర్కొనడం గమనార్హం.
బర్కత్ పుర: గతేడాది విజయదశమి నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి,నర్సన్నపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సీఎం ప్రత్యేక శ్రద్దతో అవి త్వరితగతిన పూర్తవడం నేటి ఉదయం ఆ రెండు గ్రామాలకు చెందిన 600కుటుంబాలు గృహప్రవేశం చేయడం జరిగిపోయాయి.
వేదపండితులు నిర్ణయించిన సుమూహుర్తం ప్రకారం ఉదయం7.53గం.లకు మంత్రోచ్చరణల నడుమ కొత్త ఇళ్లలోకి గ్రామ ప్రజలు అడుగుపెట్టారు. అయితే ప్రభుత్వం నిర్మించిన ఈ ఇళ్లకు వాస్తు దోషం ఉందంటూ వాసవి వాస్తు ప్లానర్స్ అధినేత ప్రకాష్ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాదు, వాస్తు దోషం కారణంగా ఆ ఇళ్లలో నివసించే ప్రజల ఆర్థికంగా, అనారోగ్యంగా చితికిపోతారని ఆయన పేర్కొనడం గమనార్హం.
ఇప్పటికైనా డబుల్బెడ్రూం ఇండ్లలో వాస్తుదోషాలను తొలగించి పేదలకు పంపిణీ చేయాలని బషీర్ బాగ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విజ్ఞప్తి చేశారు.