హాజీపూర్ ఘటన అంశాన్ని లేవనెత్తిన వీహెచ్ .. గవర్నర్ కు ఏమని ఫిర్యాదు చేశారంటే
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు మరోమారు హాజీపూర్ బాలికల రేప్ మరియు హత్య కేసులను తెరమీదకు తీసుకువచ్చారు. నేడు తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ను కలిసిన విహెచ్ హాజీపూర్ ఘటన గురించి గవర్నర్ కు వివరించారు. శ్రీనివాస రావ్ అనే కామాంధుడు రేప్ చేసి బాలికలను చంపి బావులలో పూడ్చి పెట్టిన వైనాన్ని, ఇక ఆ కేసును పట్టించుకోని ప్రభుత్వ తీరును గవర్నర్ కు ఆయన వివరించారు.
గవర్నర్ ను కలిసిన అనంతరం వి హనుమంత రావు మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆయన వెళ్లి మరీ పరామర్శిస్తారు. హాజీపూర్ బాధితులను మాత్రం పరామర్శించరా ?' అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ పై వి. హన్మంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజీపూర్ ఘటన గురించి గవర్నర్కు వివరించినట్లు తెలిపిన విహెచ్ తాను శుక్రవారం గవర్నర్ను కలిసిన అనంతరం రాజ్భవన్ వద్ద కొద్దిసేపు విలేకరులతో మాట్లాడిన ఆయన దీపావళి పండుగ తర్వాత తమ ఇంట్లో జరుపుకునే సత్యనారాయణ స్వామి వ్రతానికి గవర్నర్ను ఆహ్వానించినట్లు చెప్పుకొచ్చారు.

ఇక ఈ సమయంలోనే హాజీపూర్ ఘటన మరియు ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు, అంబేద్కర్ విగ్రహం ధ్వంసం ఘటన ,ఆర్టీసీ సమ్మె, సమ్మె వల్ల నలుగురు ఉద్యోగులు మృత్యువాత పడిన ఘటనలు విన్నవించారు. హాజీపూర్ ఘటన నేపథ్యంలో ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటుపై ఇప్పటివరకూ చర్యలు లేవని విమర్శించారు. గవర్నర్ను ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి చొరవ చూపాలని కోరారు. ఇక కొత్త గవర్నర్ తమిళ సై వచ్చాక మాకు న్యాయం జరుగుతోందని ఆశ కలుగుతుందన్నారు వీ హనుమంతరావు.
తాను చెప్పిన అంశాల పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని వీహెచ్ పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ హాజీపూర్ ఘటన జరిగి ఇంత కాలం అవుతున్న విహెచ్ వద్ద ఈ ఘటన మర్చిపోలేదు. ఏకంగా గవర్నర్ కు విన్నవించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడానికి చొరవ చూపాలని కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హాజీపూర్ ఘటన మరొకసారి వార్తల్లోకి వచ్చింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications