యాదాద్రి చానెల్ అధినేతగా విజయ్ భగవాన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని యాదాద్రి దూరదర్శన్ అధిపతిగా ఎం. విజయ భగవాన్ నియమితులయ్యారు. భారత బ్రాడ్కాస్టింగ్ సర్వీసులో ఆయన సీనియర్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆయనకు చానెల్ హెడ్గా పదోన్నతి కల్పించారు. ఈ ఉత్తర్వులు మంగళవారం నుంచి అమలులోకి వస్తాయి.
ఆయన మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ దూరదర్శన్లో పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తన టీవీ చానెల్కు మూడేళ్ల క్రితం యాదాద్రిగా నామకరణం చేసింది. ఆ తర్వాత కూడా ఆయన అందులోనే కొనసాగుతూ వచ్చారు.

కార్యక్రమాల రూపకల్పనలో, చానెల్ నిర్వహణలో ఆయనకు విశేషమైన అనుభవం ఉంది. ఆయన 1986లో యుపిఎస్పీ ద్వారా ప్రోగ్రామ్ అఫీసర్గా నియమితులయ్యారు. పూనేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్లోనూ, న్యూఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్లో శిక్షణ పొందారు.
దూరదర్శన్లో ఆయన వివిధ హోదాల్లోనూ వివిధ ప్రాంతాల్లోనూ పనిచేశారు. ఆయన హైదరాబాదుకు చెందినవారు. ఆయన టాగోర్స్ హోం, నిజాం కాలేజీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించారు.
-
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ












Click it and Unblock the Notifications