వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండుసార్లు చూశా: ‘గీత గోవిందం’ను అభినందించిన ఎంపీ కవిత

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. 'గీత గోవిందం' చిత్ర బృందాన్ని అభినందించారు. గురువారం కవిత ఈ సినిమా చూశారట. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్‌లను కలిశారు.

Recommended Video

కొత్త సినిమా ల పై కవిత అభిప్రాయం

తాను ఈ సినిమాను రెండుసార్లు చూసినట్లు తెలిపారు. సినిమా బాగుందని, ఇంత చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులకు అందించిన వారిని ఈ సందర్భంగా కవిత అభినందించారు. ఈ సందర్భంగా కాసేపు వారితో కవిత ముచ్చటించారు.

vijay deverakonda and geetha govindam team meets mp kavitha

'మీరు సినిమా చూస్తారని, మమ్మల్ని అభినందిస్తారని అస్సలు ఊహించలేదు' అని కవితతో నిర్మాత బన్నీ వాసు అన్నారు. కాగా, ఇటీవల ఆమె సోదరుడు, మంత్రి కేటీఆర్ కూడా పలు సినిమాలను తెరకెక్కించిన చిత్ర బృందాలను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే.

vijay deverakonda and geetha govindam team meets mp kavitha

కాగా, గీత ఆర్ట్స్ బ్యానర్‌(జీఏ2)పై బన్నీ వాసు, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రష్మిక మందన కథనాయికగా నటించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. అంతేగాక, పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే ఈ చిత్రం 60కోట్లకుపైగా వసూళ్ళు రాబట్టింది.

English summary
Tollywood Hero Vijay Deverakonda and Geetha Govindam movie team met Nizamabad MP Kalvakuntla Kavitha in Hyderabad on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X