రెండుసార్లు చూశా: ‘గీత గోవిందం’ను అభినందించిన ఎంపీ కవిత
హైదరాబాద్: నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. 'గీత గోవిందం' చిత్ర బృందాన్ని అభినందించారు. గురువారం కవిత ఈ సినిమా చూశారట. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్లను కలిశారు.
Recommended Video
తాను ఈ సినిమాను రెండుసార్లు చూసినట్లు తెలిపారు. సినిమా బాగుందని, ఇంత చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ప్రేక్షకులకు అందించిన వారిని ఈ సందర్భంగా కవిత అభినందించారు. ఈ సందర్భంగా కాసేపు వారితో కవిత ముచ్చటించారు.
'మీరు సినిమా చూస్తారని, మమ్మల్ని అభినందిస్తారని అస్సలు ఊహించలేదు' అని కవితతో నిర్మాత బన్నీ వాసు అన్నారు. కాగా, ఇటీవల ఆమె సోదరుడు, మంత్రి కేటీఆర్ కూడా పలు సినిమాలను తెరకెక్కించిన చిత్ర బృందాలను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే.
కాగా, గీత ఆర్ట్స్ బ్యానర్(జీఏ2)పై బన్నీ వాసు, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రష్మిక మందన కథనాయికగా నటించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. అంతేగాక, పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే ఈ చిత్రం 60కోట్లకుపైగా వసూళ్ళు రాబట్టింది.