ప్రధాని మోడీ పర్యటన వేళ విజయశాంతి సంచలన పోస్ట్!!
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు రానున్నారు. వరంగల్ లో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీంతో బీజేపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఓరుగల్లుకు చేరుకుంటున్నారు. బిజెపిలో వరంగల్ కేంద్రంగా సంబరాలు జరుగుతున్నాయి. ఇక ఇదే సమయంలో బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ చేశారు.
కావాలని బిజెపి, బీఆర్ఎస్ ఒకటే అనే సంకేతం వెళ్లేలాగా దుష్ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియాలో మండిపడిన విజయశాంతి ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయనందువల్ల బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్న సంకేతం వెళుతుందని, అలాగే తమ్ముడు సంజయ్ గారిని మార్చడం బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర అనీ... అందుకే కాంగ్రెస్ గ్రాఫ్ కొంచెం పెరుగుతుంది. బీజేపీ తగ్గుతున్నదనే ప్రచారం బీజేపీ వ్యతిరేకులు, బీజేపీ వ్యతిరేక మీడియా చేస్తుందని సంచలన పోస్ట్ చేశారు.

ఇక ఇందులోనే మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. గమనించివలసింది కూడా ఒకటున్నదన్న రాములమ్మ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అయితే ఆ వ్యతిరేక ప్రత్యేక ఓటు బీఆర్ఎస్కు కూడా వ్యతిరేకమై కేసీఆర్ గారి ఓటమికి పనిచేస్తది కదా? అంటూ ఆమె పేర్కొన్నారు.అలా అయితే కవిత గారి అరెస్టు అందరికన్నా అత్యంత అవసరం కేసిఆర్ గారికే కదా... మరి బీఆర్ఎస్ అందుకోసం డిమాండ్ చేస్తదా? అంటూ ప్రశ్నించారు.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో సీబీఐ విచారణ జరిగినప్పుడు అంత ఆత్రంగా కవితతో పాటు మందీ మార్బలాన్ని ఢిల్లీ పంపడం సానుభూతి కోసం ఆడిన డ్రామానా? బీఆరెస్, బీజేపీ ఒక్కటే అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది? బట్ట కాల్చి బీజేపీ మీదేసి దెబ్బ తీస్తాం... వదిలించుకొని బయట పడాల్సింది బీజేపీయే అనే దుర్మార్గాన్ని తన అనుకూల మీడియా ద్వారా కేసిఆర్ ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.
కవిత గారిని అరెస్టు చేయనందువల్ల బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్న సంకేతం వెళుతున్నది. తమ్ముడు సంజయ్ గారిని మార్చడం బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర అనీ... అందుకే కాంగ్రెస్ గ్రాఫ్ కొంచెం పెరుగుతుంది, బీజేపీ తగ్గుతున్నదనే ప్రచారం చేస్తున్న బీజేపీ వ్యతిరేకులు, pic.twitter.com/sWP1mYDaXH
— VIJAYASHANTHI (@vijayashanthi_m) July 7, 2023
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే బీఆరెస్కి నష్టం... అదే కాంగ్రెస్ కు కొంచెం ఎక్కువ వస్తే బీఆరెస్కి మేలు అని చెప్పడానికి గత ఎన్నికలప్పుడు చోటు చేసుకున్న పరిణామాలే నిదర్శనం అని విజయశాంతి పేర్కొన్నారు. మళ్లీ అలాగే జరగాలని గులాబీ అధినేత కోరుకుంటున్నారని విజయశాంతి అన్నారు.
అందుకే ఈ కుట్రలకు తెరలేపారు. ఒకవైపు మళ్లీ అధికారం తమదేనని చెప్పుకుంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న బీఆర్ఎస్ అధిపతికి ఈ వంచనలెందుకు? గెలుపుపై అంత ధీమా ఉన్నప్పుడు ఈ మోసాలెందుకు? అంటూ విజయశాంతి సోషల్ మీడియా వేదికగా కెసిఆర్ ను టార్గెట్ చేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications