హైద్రాబాద్ సుజన మాల్లో కోహ్లీ సందడి, వారించినా ఫ్యాన్స్కు సమాధానం
హైదరాబాద్: భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ శుక్రవారం నాడు హైదరాబాదులో సందడి చేశారు. కేపీహెచ్బీలోని సుజనా ఫోరం మాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన రాంగ్ స్టోర్ను కోహ్లీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోహ్లీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.
మీడియా, అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు కోహ్లీ సమాధానం చెప్పాడు. కార్యక్రమంలో భాగంగా అభిమానులు వేసిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పాడు. నిర్వాహకులు వారిస్తున్నా పూర్తిస్థాయిలో సమాధానాలు చెప్పారు.
ఈ సందర్భంగా అభిమానుల నుంచి అతడికి వ్యక్తిగతమైనవే కాకుండా కెరీర్ పరంగా ప్రశ్నలు అడిగారు. వాటికి అతను ఓపిగ్గా, వివరంగా సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత సెల్ఫీ స్టిక్ చేతబట్టి అభిమానులతో సెల్ఫీలు తీసుకుని సందడి చేశాడు.
కోహ్లీ మాట్లాడుతూ.. హైదరాబాదీయులు చాలా ఫ్యాషనబుల్ అన్నారు. హైదరాబాద్ అంటే తనకు ఇష్టమని చెప్పాడు. ఈ సందర్భంగా కోహ్లీ తన సొంత బ్రాండ్ అయిన వ్రాగన్ బట్టల షాపును ప్రారంభించాడు.