జిహెచ్ఎంసిలో 6.35 లక్షల మంది ఓటర్లను తొలగించాం: భన్వర్లాల్
హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) పరిధిలో 6.35 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ చెప్పారు. ఇప్పటి వరకు 19 లక్షల మందికి నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఓటర్లు తమ ఓటర్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని భన్వర్ లాల్ తెలిపారు. నియోజకవర్గం మారిన ఓటర్లు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ 31లోగా ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. వచ్చే జనవరి 11న కొత్త ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు.

జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కొత్త ఓటరు కార్డులు జారీ చేస్తామన్నారు. ఎల్లుండి నుంచి డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేపడుతామని చెప్పారు. అర్హులైనవారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాజకీయ పార్టీల ఏజెంట్లు పోలింగ్ బూత్ల్లో ఉండేలా చూసుకోవాలని ఆయన అన్నారు.
చనిపోయిన, డుప్లకేట్, తరలిపోయిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు. అర్హులైనవారి పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు చూపిస్తే అందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications