వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌లో 14 లక్షల బోగస్ ఓట్లు, ఆధార్‌తో లింక్: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదు నగరంలో 15 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అన్నారు. బోగస్ కార్డుల ఏరివేతకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సోమవారం ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిశారు. ఓటర్ గుర్తింపు కార్డులకు ఆధార్ లింకేజీపై చర్చించారు.

జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన కంటే ముందే ఓటర్ల జాబితా సిద్ధంచేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్‌లోనే ఎక్కువ బోగస్ ఓటర్లు ఉండే అవకాశం ఉందని, ఓటర్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోకుంటే ఓటు హక్కు ఉండదని సీఎం స్పష్టం చేశారు.

Voting right will be linked to Aadhar card: KCR

హైదరాబాద్‌లో బోగస్ ఓట్లు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తొలుత హైదరాబాద్‌లో ఓటరు కార్డులకు ఆధార్ అనుసంధానం చేస్తామని, ఆ తర్వాత రాష్ట్ర మంతటా ఆధార్ అనుసంధానం కార్యక్రమం ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.

బోగస్ ఓటర్లు నమోదు కావడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన అన్నారు. బోగస్ ఓటర్ల ఏరివేతకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. ఆధార్ కార్డుతో ఓటరు గుర్తింపు కార్డు అనుసంధానంపై పెద్ద యెత్తున ప్రచారం చేపట్టాలని సూచించారు. ఎన్నికల సంఘం చర్యలకు తాము పూర్తిగా సహకరిస్తామని ఆయన చెప్పారు.

English summary
Telangana CM K Chnadrasekhar Rao said that Voters identity cards will be linked with Aadhar cards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X