వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీఈఎస్2017: ఇవాంకా నోట మన రాజ్‌లక్ష్మి పేరు, ఎవరీమె?

హైద్రాబాద్‌లో జీఈఎస్ 2017 సదస్సు ప్రారంభోత్సవ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ఉపన్యాసంలో ముగ్గురు మహిళల పేర్లను ప్రస్తావించారు. వారిని ప్రతినిధులందరికీ పరిచయం చేయించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైద్రాబాద్‌లో జీఈఎస్ 2017 సదస్సు ప్రారంభోత్సవ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ఉపన్యాసంలో ముగ్గురు మహిళల పేర్లను ప్రస్తావించారు. వారిని ప్రతినిధులందరికీ పరిచయం చేయించారు. ఈ ముగ్గురిలో ఇండియాకు చెందిన రాజ్‌లక్ష్మికి చోటు దక్కింది. రాజ్‌లక్ష్మి బెంగుళూరు వాసి.

Recommended Video

GES 2017 : Ivanka Trump Security Details Leaked

ఇవాంకా ట్రంప్‌కు టిఆర్ఎస్ టిక్కెట్టు: రాత్రికి రాత్రే రోడ్లు,రాజశేఖర్ వీడియో వైరల్ఇవాంకా ట్రంప్‌కు టిఆర్ఎస్ టిక్కెట్టు: రాత్రికి రాత్రే రోడ్లు,రాజశేఖర్ వీడియో వైరల్

ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నవంబర్ 28వ, తేదిన హైద్రాబాద్ హెచ్ఐసిసిలో ప్రారంభమైంది. ఈ సదస్సులో ఇవాంకా ట్రంప్ ముగ్గురి మహిళల పేర్లను ప్రముఖంగా ప్రస్తావించింది.

జీఈఎస్ 2017:13 ఏళ్ళ అస్ట్రేలియన్ హమీష్‌కు చోటు, యాప్‌ల తయారీలో దిట్టజీఈఎస్ 2017:13 ఏళ్ళ అస్ట్రేలియన్ హమీష్‌కు చోటు, యాప్‌ల తయారీలో దిట్ట

మహిళల సాధికారిత వల్ల ఏ రకంగా ప్రయోజనం పొందుతారో ఇవాంకా ప్రస్తావించారు. తొలిసారిగా జీఈఎస్ సదస్సులో సుమారు 50 శాతం మహిళా ప్రతినిధులు పాల్గొంటున్న విషయాన్ని కూడ ఆమె ప్రస్తావించారు.

నమస్తే మోడీజీ, నమస్తే ఇవాంకా ట్రంప్: జీఈఎస్‌లో' మిత్ర' రోబోల పలకరింపునమస్తే మోడీజీ, నమస్తే ఇవాంకా ట్రంప్: జీఈఎస్‌లో' మిత్ర' రోబోల పలకరింపు

ఇండియా చరిత్ర, సంస్కృతి చాలా ఇష్టం, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఇవాంకా ట్రంప్ఇండియా చరిత్ర, సంస్కృతి చాలా ఇష్టం, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఇవాంకా ట్రంప్

 ముగ్గురు మహిళల పేర్లను ప్రస్తావించిన ఇవాంకా

ముగ్గురు మహిళల పేర్లను ప్రస్తావించిన ఇవాంకా

జీఈఎస్ 2017 సదస్సు ప్రారంభోత్సవ ఉపన్యాసంలో డొనాల్డ్ ట్రంప్ కూతరు ఇవాంకా ట్రంప్ ముగ్గురు మహిళల పేర్లను ప్రస్తావించింది. బెంగళూరుకు చెందిన రాజ్‌లక్ష్మి ,అజర్‌ బైజాన్‌కు చెందిన రేహాన్‌, దారా డోట్జ్‌ అమెరికాలోని శాన్‌ప్రాన్సిస్కో‌కు చెందినవారు. ఈ ముగ్గురి పేర్లను ఇవాంకా ట్రంప్ ప్రస్తావించారు. వారందరిని పిలిచి ప్రతినిధులకు పరిచయం చేశారు.వారి గురించి పలు విషయాలను ప్రస్తావించారు.

 ఎవరీ రాజ్‌లక్ష్మీ

ఎవరీ రాజ్‌లక్ష్మీ

బెంగళూరుకు చెందిన రాజ్‌లక్ష్మి రెండు దశాబ్దాలుగా ఐటీ రంగంలో ఉన్నారు. టెర్రా బ్లూ ఎక్స్‌టీ అనే సంస్థను స్థాపించారు. దానికి ఆమే సీఈవో. క్రానిక్‌ నరాల జబ్బులు, జీవనశైలి జబ్బులను గుర్తించడానికి, వాటి చికిత్సకు వీలుగా రాజ్‌లక్ష్మి, ఆమె బృందం కలిసి ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ సహకారంతో పనిచేసే పరికరాలను తయారు చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన పరికరాలతో ఎన్నో ప్రాణాలను కాపాడుతున్నారు. మరెంతో మంది మెరుగైన జీవన శైలిని అవలంబించడానికి కారణం అవుతున్నారు.

 కొడుకు కోసం రాజ్‌లక్ష్మి

కొడుకు కోసం రాజ్‌లక్ష్మి

రాజ్‌లక్ష్మి కొడుకుకు చిన్న వయసులోనే సీజర్స్‌ అనే జబ్బు రావడమే. అతని ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఆమె సొంతంగా ఓ పరిష్కారాన్ని కనుక్కోవాలని నిర్ణయించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహాయంతో ఆమె ఓ స్మార్ట్‌ గ్లోవ్‌ను రూపొందించారు. ఇది వివిధ జబ్బులను గుర్తించడమే కాదు, అవి వచ్చే అవకాశాన్నీ చెబుతుంది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా తమ ఉత్పత్తులు అందుబాటులో ఉండాలని ఆమె భావిస్తున్నారు.

 వర్షపు నీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న 15 ఏళ్ళ రేహన్

వర్షపు నీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న 15 ఏళ్ళ రేహన్

అజర్‌ బైజాన్‌కు చెందిన రేహాన్‌కు 15 ఏళ్లు. అంత చిన్న వయసులోనే, ‘ప్రతి ఇంటినీ వెలిగించాలి' అనే నినాదంతో ఆమె ఓ స్టార్టప్‌ కంపెనీని స్థాపించారు. వాననీటి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయడమే ఈ కంపెనీ ఉద్దేశ్యం. . క్యూబాలో పుట్టిన రేహాన్‌ ప్రస్తుతం బాకూలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఈ ఏడాది మేలో, యూరప్‌లో జరిగిన న్యూ ఐడియా కాంపిటీషన్‌, క్లైమేట్‌ లాంచ్‌పాడ్‌ సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో పాల్గొంటున్న మహిళా ప్రతినిధుల్లో రేహన్ చిన్నవయస్సుంది. రెండు పోటీల్లోనూ ఆమె ఫైనల్స్‌కు చేరారు. ఆగస్టులో ‘ఆడియన్స్‌ ఫేవరెట్‌ స్టార్టప్‌' అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె వాననీటి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయడాన్ని అభివృద్ధి చేస్తున్నారు.

 దారా డోట్జ్ పేదలకు సహయం

దారా డోట్జ్ పేదలకు సహయం

శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన దారా డోట్జ్ ... త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ రంగంలో ఉన్నారు. దశాబ్ద కాలం పాటు పేదల కోసం పని చేశారు. ముఖ్యంగా హైతీ భూకంపం అనంతరం ఆమె చేసిన సాయం అంతర్జాతీయ గుర్తింపు సంపాదించింది. త్రీడీ ప్రింటింగ్‌ ద్వారా భూకంప బాధితుల అనేక సమస్యలకు పరిష్కారాలు కనుక్కొన్నారు. టెడెక్స్‌ లాంటి వేదికల మీద ఆమె విపత్తు నిర్వహణలో త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ పాత్ర గురించి ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడ విపత్తు సంభవించినా ఆమె కంపెనీ ఫీల్డ్‌ రడీకి పిలుపు వస్తుంది.

English summary
In her address at the Global Entrepreneurship Summit (GES) in Hyderabad on Tuesday, Ivanka Trump applauded three women entrepreneurs who she claimed represented "the vision, ambition, and grit of every entrepreneur," and one of these entrepreneurs was Rajlakshmi Borthakur.Borthakur, a businesswoman of Assamese origin, invented a revolutionary epilepsy detection device called T-jay. She is currently based out of Bengaluru and is the CEO and founder of TerraBlue XT, the company that manufactures the device.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X