సెల్యూట్ కల్నల్ సంతోష్ బాబు: నాలుగేళ్ల కుమారుడు, భార్య కన్నీటి వీడ్కోలు..
డ్రాగన్ చైనా ముష్కరుల దాడిలో ఆసువులు బాసిన కల్నల్ సంతోష్ బాబుకు కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. సూర్యాపేట కేసారంలోని సంతోష్ బాబు వ్యవసాయ క్షేత్రంలో ఆర్మీ, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. కరోనా వైరస్ సందర్భంగా కొద్దిమందికే అనుమతి ఇచ్చిన వందలాది మంది అంత్యక్రియలు నిర్వహించే చోటుకు వచ్చి, తుది వీడ్కోలు పలికారు. సంతోష్ తండ్రి చితీకి నిప్పుపెట్టగా.. అతని నాలుగేళ్ల కుమారుడు అనిరుధ్ తల్లితో కలిసి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నాడు. ఈ ఘట్టం చూసిన ప్రతీ ఒక్కరు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

ఆర్మీ మూడు రౌండ్లు కాల్పులు జరిపాక.. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. అయితే సంతోష్ కుమారుడు అనిరుధ్, భార్య సెల్యూట్ చేసి.. వీడ్కోలు పలికారు. కంటినుంచి వస్తోన్న దు:ఖాన్ని ఆపుకొని మరీ.. కన్నీటి వీడ్కోలు తెలిపారు. ఆర్మీ గౌరవ వందనం తర్వాత.. భారత్ మాతా కీ జై అనే నినాదాలతో ఆ ప్రాంగణం మారుమోగింది. సంతోష్ బాబు అమర్ రహే, వందేమాతరం అంటూ నినాదించారు. అంతకుముందు 6 కిలోమీటర్లు సాగిన అంతిమయాత్రలో ప్రజలు పూలు చల్లారు.
Recommended Video
సంతోష్ బాబుకు గౌరవసూచకంగా గురువారం షాపులను మూసివేశారు. 45 ఏళ్ల తర్వాత తూర్పు లడాఖ్ గాల్వాన్ వ్యాలీ వద్ద చైనాకు చెందిన జవాన్లు కల్నల్ సంతోష్ బాబు అండ్ టీమ్పై రాళ్లతో దాడిచేశారు. దీంతో 20 మంది జవాన్లు వీరమరణం పొందారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications