ప్రియుడి దారుణం: తల్లితో సహజీవనం, కూతురుపై అత్యాచారం
హైదరాబాద్: తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ఫిర్యాదు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన హైదరాబాదులోని పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ మహిళ(35)కు నలుగురు పిల్లలు. మధ్యప్రదేశ్కు చెందిన జయవీర్(21)తో ఆమెకు పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తతో సఖ్యత లేకపోవడంతో ఆమె ఇద్దరు పిల్లలను తీసుకుని జయవీర్తో కలిసి విజయవాడకు వెళ్లింది.
విజయవాడలో రెండు నెలలు ఉన్నారు. ఆ తర్వాత గత ఏడాది మే నెలలో జల్పల్లి మున్సిపాలిటీలోని శ్రీరామ్ కాలనీకి వచ్చి వారిద్దరు ఉంటున్నారు. ఇద్దరు స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో కూలీలుగా పని చేస్తున్నారు.
మహిళతో సహజీవనం చేస్తున్న జయవీర్ ఆమె కూతురు(15)పై కన్నేశాడు. బాలికను బెదిరించి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. బాలికను వివాహం చేసుకుంటానని వేధింపులకు గురి చేస్తున్నాడు. బాలిక తల్లి శనివారం సాయంత్రం పహడీషరీఫ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని జయవీర్ను అదుపులోకి తీసుకున్నారు.