సర్వే: సోషల్ మీడియా కంటే వ్యక్తిగతంగానే, కలల ఉద్యోగం.. టెక్కీ
ముంబై: యువత ఇంటర్నెట్, చాటింగ్, ఫేస్బుక్, వాట్సాప్లలో ఎక్కువ కాలం గడుపుతోంది. స్నేహితులతో, బంధువులతో నిత్యం టచ్లో ఉండేందుకు యువత ఫేస్బుక్, వాట్సాప్ వంటి వాటిని విరివిగా వినియోగిస్తోంది. అయితే, తాజాగా ఓ సర్వేలో షాకింగ్ విషయం తెలిసిందే.
ఇప్పటికీ, ఎప్పుడూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో గడిపే యువత.. స్నేహితులను, బంధువులను కలిసేందుకు చాటింగ్ కంటే నేరుగా కలవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఓ సర్వేలో తేలింది. మన దేశంలోని పదిహేను నగరాల్లో సర్వే చేశారు.
టెక్నాలజీ, వార్తలు తదితరాలకు సంబంధించిన సమాచారం కోసం యువత ఎక్కువగా ఇంటర్నెట్ పైనే ఆధారపడుతోందని సర్వే ద్వారా వెల్లడైంది. అంతేకాదు, యువతకు ఇప్పటికీ సాఫ్టువేర్ ఉద్యోగం రంగుల కలగానే ఉందని తేలింది. ఎక్కువ మంది ఇంకా సాఫ్టువేర్ రంగం వైపే మొగ్గు చూపుతున్నారు.
32.6 శాతం మంది తాము సాఫ్టువేర్ ఇంజినీర్లం కావాలనుకుంటున్నట్లు చెప్పారు. దేశంలోని పదిహేను నగరాల్లో ఈ సర్వే చేశారు. టీసీఎస్ ఈ సర్వేను నిర్వహించింది. దేశంలో 15వేల మంది యువత ఈ సర్వేలో పాల్గొన్నారు.