ఎన్నికల యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేస్తున్న వైఎస్ షర్మిల.. జగన్ చెల్లెలా.. మజాకానా!!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వైయస్ షర్మిల దూకుడును పెంచుతున్నారు. రాష్ట్ర రాజకీయాలలో ఒంటరిగా అడుగుపెట్టిన వైయస్ షర్మిల వైయస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించి ప్రజాక్షేత్రంలో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పై, సీఎం కేసీఆర్ పాలన పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న వైయస్ షర్మిల వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

పార్టీ సైన్యాన్ని సిద్ధం చేసే పనిలో వైఎస్ షర్మిల
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పాలేరు నుండి పోటీ చేస్తానని, పాలేరు మట్టి సాక్షిగా ప్రమాణం చేసి ప్రకటన చేసిన వైఎస్ షర్మిల, వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల రేపు లోటస్ పాండ్ లో పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి ఏం చేయాలి? ఏ విధంగా మన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి? తక్కువ సమయంలో ప్రజలకు ఎక్కువగా రీచ్ కావడానికి సోషల్ మీడియాని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? వంటి అనేక విషయాలపై వైయస్ షర్మిల పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

రేపు పార్టీ శ్రేణులకు లోటస్ పాండ్ లో వర్క్ షాప్
డిసెంబర్ 23వ తేదీన ఉదయం 11 గంటలకు లోటస్ పాండ్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ సోషల్ మీడియా వర్క్ షాప్ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులకు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులకు, ఉమ్మడి జిల్లాల పార్టీ పరిశీలకులకు, జిల్లా పార్టీ అధ్యక్షులకు, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ లకు, మండల మరియు డివిజన్ అధ్యక్షులకు, పట్టణ అధ్యక్షులకు, ఐటీ వింగ్ కోఆర్డినేటర్ లకు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రకటన విడుదల చేసింది.

జనంలోకి వెళ్లడానికి సోషల్ మీడియా పై ఫోకస్ చేస్తున్న షర్మిల
ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వర్క్ షాప్ కు హాజరుకావాలని పేర్కొంది. దీంతో వైయస్ షర్మిల వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని జనంలోకి వెళ్లడానికి సోషల్ మీడియా పై ఫోకస్ చేస్తున్నట్లుగా ప్రధానంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగడం కోసం ప్రయత్నం చేస్తున్న వైయస్ షర్మిల, రాజకీయాలను ఈజీగా తీసుకోవడం లేదని వైయస్సార్ తెలంగాణ పార్టీ అడుగులను శరవేగంగా, దూకుడుగా వేస్తున్నారని స్పష్టంగా కనిపిస్తుంది.

తెలంగాణా రాజకీయ వర్గాలకు షర్మిల రాజకీయంపై ఆసక్తి
ఎలాంటి అణిచివేతలు ఎదురైనా, ఆమెను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం పోరాటం చేసి తీరుతామని, రాజన్న రాజ్యం తీసుకు వచ్చేవరకూ, వైయస్ సంక్షేమ పాలన అందించే వరకూ తాను వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెబుతున్న షర్మిల, ఆ మార్గంలో తనదైన పంథాలో ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె వేస్తున్న అడుగులను తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
-
ఈ బొమ్మల్లో నిజమైన "గుడ్లగూబ" ఎక్కడుందో కనిపెట్టగలరా..? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications