వారెవ్వా.. ఏం యాక్టింగ్.. కిడ్నాప్ అయినట్లు నటించి.. పెళ్లి చేసుకుని వీడియో విడుదల చేసిన యువతి..
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో గోలి శాలిని కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. శాలిని ప్రియుడితో కావాలనే వెళ్లిపోయినట్టు తెలిసింది. కిడ్నాప్ ఘటన తర్వాత ఆమె వీడియో కూడా విడుదల చేసింది. ప్రేమ పెళ్లికి ఇంట్లో వారికి ఇష్టం లేకపోవడంతోనే ప్రియుడి తో వెళ్ళిపోయినట్టు వీడియో విడుదల చేసింది.

సీసీటీవీ ఫుటేజీ
అంతకు ముందు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. తండ్రితో కలిసి వేకువ ఝామున గుడికి వెళ్లిన యువతిని దుండగులు ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ వైరల్ అయింది. అయితే సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ ఈ విషయంపై స్పందించారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమన్న ఆయన.. కిడ్నాప్ నిందితులను సాయంత్రంలోగా పట్టుకోవాలని కేటీఆర్ ఆదేశించారు.

పోలీసులకు ఫిర్యాదు
యువతిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. తెల్లవారుజామున కారులో వచ్చిన వ్యక్తులు, తండ్రిని తోసేసి అమ్మాయిని తీసుకెళ్లారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిపై యువతి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.
వీడియో విడుదల
కానీ అమ్మాయే తను ఆ యువకుడిని పెళ్లి చేసుకున్నాను అని వీడియో విడుదల చేయడంతో కథ సుఖాంతం అయింది. దీంతో పోలీసులు, తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications