తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో పేలిన రెండు నాటు బాంబులు .. తనిఖీలలో బయటపడిన విషయం ఇదే !!
తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో నాటు బాంబుల కలకలం రేగింది. యూనివర్సిటీ ఆవరణలోని ఐ బ్లాక్ సమీపంలో ఈరోజు ఉదయం రెండు నాటు బాంబులు పేలడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నాటు బాంబులు పేలిన ఘటనలో అక్కడే ఉన్న ఓ కుక్క, ఓ పంది మృతి చెందినట్లుగా సమాచారం. ఇక ఈ విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన యూనివర్సిటీ కి చేరుకొని తనిఖీలు నిర్వహించారు.
ఒకపక్క తిరుపతిలో పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికల హడావుడి కొనసాగుతూ ఉంటే, నాటు బాంబులు పేలడం అందరినీ ఒక్క సారిగా భయాందోళనకు గురి చేసింది. బాంబు స్క్వాడ్ సిబ్బంది అక్కడ తనిఖీలు చేశారు. పెరుమాళ్ళ పల్లెకు చెందిన ఇద్దరు అనుమానితులను యూనివర్సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలు చేపట్టిన పోలీసులు నాటు బాంబులు అడవి పందులు పట్టుకోవడం కోసం వేటగాళ్ళు పెట్టిన బాంబులు గా గుర్తించారు .

జంతువులను వేటాడటం కోసం అక్కడ పెట్టిన ఇద్దరు వేటగాళ్లు ను అరెస్ట్ చేసిన పోలీసులు ,వారిని విచారిస్తున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడినట్లు గా తెలుస్తోంది. ఇక యూనివర్సిటీలో ఈ తరహా బాంబు బ్లాస్ట్ ఘటనలు విద్యార్థులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని, నాటు బాంబు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications