అచ్చెన్నాయుడు అరెస్ట్: వందలమంది ఇంట్లో చొరబడ్డారు! భార్య, ఫ్యామిలీ ఏమన్నారంటే?
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిపుట్టించింది. శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

వందల మంది ఇంట్లో చొరబడి..
కాగా, అచ్చెన్నాయుడు అరెస్టు తీరుపై ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిమ్మాడలోని తమ నివాసంలోకి 200 నుంచి 300 మంది గోడదూకి చొరబడ్డారని అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ తెలిపారు. అరెస్టుకు సంబంధించి తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఆయన చెప్పారు.

విశ్రాంతి తీసుకుంటున్న అచ్చెన్నాయుడును..
అచ్చెన్నాయుడి అరెస్ట్ అనంతరం ఆయన సతీమణి విజయమాధవి మీడియాతో మాట్లాడారు. శుక్రవారం ఉదయం 7.20 గంటలకు.. అప్పుడే స్నానం చేసి కూర్చున్న అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని తెలిపారు. ప్రస్తుతం అచ్చెన్నాయుడు ఆరోగ్యం కూడా బాగా లేదని చెప్పారు. గురువారం చిన్న సర్జరీ జరిగిందని.. వైద్యుల సూచన మేరకు ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని ఆమె తెలిపారు. మందులు వేసుకోవాలని చెప్పినా వినకుండా తీసుకెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయ కుట్రలో భాగమే అరెస్టు..
ఇక తెలుగుదేశం పార్టీ నేతలు అధికార వైసీపీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. బీసీ నేత అచ్చెన్నాయుడును కక్షపూరితంగానే అరెస్ట్ చేశారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులు సరికాదన్నారు. రాజకీయ కుట్రలకు ప్రజాస్వామ్య వ్యవస్థలను వాడుకోవడం దారుణమని విమర్శించారు. ఏపీలో జరుగుతున్న కక్షపూరిత రాజకీయాలను ప్రతీ ఒక్కరూ ఖండించాలన్నారు.
Recommended Video

అరెస్టుకు భారీ మూల్యం తప్పదు..
టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం దుర్మార్గమని మరో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. రాజకీయంగా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రిని అక్రమ కేసుల్లో ఇరికించడం కుట్ర కాదా? అని నిలదీశారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర. నోటీసులు ఇచ్చి వివరణ కూడా ఇవ్వకుండా అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. బీసీ నాయకులను అణగదొక్కేందుకు అధికార పార్టీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications