నిమ్మగడ్డపై కొడాలినాని సంచలన కామెంట్స్- ఆయనేం చేయలేరు- సుప్రీంలోనే తేల్చుకుంటాం...
ఏపీ ఎన్నికల కమిషనర్ గా మరోసారి నియమితులైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తమ చిటికెన వేళ్ల మీద వెంట్రుకలు కూడా పీకలేరన్నారు. ఏపీ ఎస్ఈసీగా రమేష్ కుమార్ టీడీపీ కనుసన్నల్లో వ్యవస్థల్ని నడిపారనీ... ఆ విషయాన్ని హైకోర్టు లెక్కలోకి తీసుకోలేదని అభిప్రాయపడ్డారు. అయినా ప్రభుత్వం ప్రజల కోసం అనుకున్న పని చేసి తీరుతుందని నాని సంకేతాలు ఇచ్చారు.

గుడివాడ మార్కెట్ యార్డులో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నాని... రమేష్ కుమార్ వ్యవహారంలో పలు అంశాలపై స్పందించారు. ఒక్కో సమయంలో కోర్టుల్లో న్యాయం జరగకపోవచ్చని... అలాంటప్పుడు పై కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని ఆయన అన్నారు. నిమ్మగడ్డ కేసుకు సంబంధించి న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా ప్రజల కోసం అనుకున్నపని చేసి తీరుతామన్నారు. కింది కోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళతామన్నారు.












Click it and Unblock the Notifications